Up Elections 2nd Phase: 55 స్ధానాలకు పోలింగ్.. బీజేపీకి గట్టిపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేడు రెండవ విడతలో 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈవిడతలో అధికార బీజేపీకి సానుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. గట్టిపోటీని ఎదుర్కుంటున్నారు అధికార బీజేపీ అభ్యర్ధులు. షాజహాన్ పూర్, రాంపూర్ స్థానాలపైనే అందరి దృష్టి వుంది.
1989 నుంచి షాజహాన్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికై, 9 వ సారి కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఖన్నా. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పలుమార్లు ఎమ్.ఎల్.ఏ గా గెలిచి, ప్రస్తుతం రాంపూర్ లోకసభ స్థానానికి ఎమ్.పి గా ఉన్నారు ఆజం ఖాన్. ఈ విడతలో ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండటమే బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రోహా, ఛమ్రువా, నగినా లాంటి అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వున్నారు.
Also Read
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
గత అసెంబ్లీ (2017) ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో 38 స్థానాల్లో బిజేపి, 15 స్థానాల్లో సమాజవాది పార్టీ ( ఎస్.పి) గెలిచింది. అయితే, రెండేళ్ల తర్వాత, 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కేవలం 27 అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యత నిలుపుకుంది బీజేపీ. సుమారు 25 అసెంబ్లీ స్థానాల్లో గెలుపును నిర్ధారించనున్నారు ముస్లింలు.
9 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం పైగా ముస్లిం ఓటర్లు వుండడంతో బీజేపీకి గడ్డుపరిస్థితి తప్పదంటున్నారు. మరికొన్ని స్థానాల్లో 40 శాతం నుంచి 50 శాతం ముస్లిం ఓటర్లు వున్నారు. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు ( ఓబిసి) లు. గెలుపును నిర్ధారించే సామాజిక వర్గాలు వున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్.పి. ఈసారి జయంత్ చౌధురి నేతృత్వంలోని ఆర్.ఎల్.డి తో పొత్తు కుదుర్చుకుంది. 2019 లో లోకసభ కు జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎస్.పి. 2019 లో లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఎస్.పి—బి.ఎస్.పి కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ముస్లింలు. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో, మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో ఎస్.పి-బిఎస్పి కూటమి అధిక్యతను సాధించగా, మొత్తం 55 స్థానాల్లో బిజేపి కంటే అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకుంది ఎస్.పి-బిఎస్పి కూటమి. మొత్తం మీద బీజేపీ ఈ విడత ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేయాల్సిందే అంటున్నారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!