Up Elections 2nd Phase: 55 స్ధానాలకు పోలింగ్.. బీజేపీకి గట్టిపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేడు రెండవ విడతలో 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈవిడతలో అధికార బీజేపీకి సానుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. గట్టిపోటీని ఎదుర్కుంటున్నారు అధికార బీజేపీ అభ్యర్ధులు. షాజహాన్ పూర్, రాంపూర్ స్థానాలపైనే అందరి దృష్టి వుంది.
1989 నుంచి షాజహాన్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికై, 9 వ సారి కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఖన్నా. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పలుమార్లు ఎమ్.ఎల్.ఏ గా గెలిచి, ప్రస్తుతం రాంపూర్ లోకసభ స్థానానికి ఎమ్.పి గా ఉన్నారు ఆజం ఖాన్. ఈ విడతలో ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండటమే బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రోహా, ఛమ్రువా, నగినా లాంటి అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వున్నారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
గత అసెంబ్లీ (2017) ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో 38 స్థానాల్లో బిజేపి, 15 స్థానాల్లో సమాజవాది పార్టీ ( ఎస్.పి) గెలిచింది. అయితే, రెండేళ్ల తర్వాత, 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కేవలం 27 అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యత నిలుపుకుంది బీజేపీ. సుమారు 25 అసెంబ్లీ స్థానాల్లో గెలుపును నిర్ధారించనున్నారు ముస్లింలు.
9 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం పైగా ముస్లిం ఓటర్లు వుండడంతో బీజేపీకి గడ్డుపరిస్థితి తప్పదంటున్నారు. మరికొన్ని స్థానాల్లో 40 శాతం నుంచి 50 శాతం ముస్లిం ఓటర్లు వున్నారు. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు ( ఓబిసి) లు. గెలుపును నిర్ధారించే సామాజిక వర్గాలు వున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్.పి. ఈసారి జయంత్ చౌధురి నేతృత్వంలోని ఆర్.ఎల్.డి తో పొత్తు కుదుర్చుకుంది. 2019 లో లోకసభ కు జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎస్.పి. 2019 లో లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఎస్.పి—బి.ఎస్.పి కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ముస్లింలు. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో, మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో ఎస్.పి-బిఎస్పి కూటమి అధిక్యతను సాధించగా, మొత్తం 55 స్థానాల్లో బిజేపి కంటే అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకుంది ఎస్.పి-బిఎస్పి కూటమి. మొత్తం మీద బీజేపీ ఈ విడత ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేయాల్సిందే అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!