Yogi Adityanath: బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగి వార్నింగ్..
- బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు..
- మాఫియా అణిచివేత కొనసాగుతుంది..
- రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం యోగి సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: నేరగాళ్లు, మాఫియా అణిచివేతను కొనసాగిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. అణిచివేత చర్యలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ‘‘ప్రతి పేద, దోపిడి, అణగారిన మరియు అణగారిన వ్యక్తి ప్రయోజనాలను పరిరక్షించడం మా బాధ్యత, అది ల్యాండ్ మాఫియా లేదా మరేదైనా మాఫియా అయినా, చర్యలు తీసుకుంటాము’’ గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో సమన్వయం చేసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని పొందాలని అధికారుల్ని ఆదేశించారు.
Read Also: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
జిల్లా, మండల స్థాయిల్లో జనతా దర్శన్ కార్యక్రమాలనున వెంటనే ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. అవినీతికి వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీకి అనుగుణంగా, రాష్ట్ర సచివాలయం నుండి బ్లాక్ స్థాయి వరకు అనైతిక లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతిభద్రతలను సమీక్షించారు.
వీఐపీ కల్చర్ను ప్రోత్సహించరాదని, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో హూటర్లు, ప్రెషర్ హారన్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే ఉత్సవాల్లో శాంతి సామరస్యాలు కాపాడుకోవాలని నొక్కి చెప్పారు. జూన్ 16న గంగా దసరా, జూన్ 17న బక్రీద్, జూన్ 18న జ్యేష్ఠ మాసం మంగళ్ పండుగ, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో శాంతి భద్రతలపై అధికారులకు సూచనలు చేశారు. రానున్న బక్రీద్ పండుగల సందర్భంగా రోడ్డుపై నమాజ్ చేయరాదని, నిషేధిత జంతువులను వధిస్తే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. బక్రీద్ రోజున జంతువుల్ని బలి ఇచ్చే ప్రదేశాలను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లోనే బలి ఇవ్వాలని, నిషేధిత జంతువులను బలి ఇవ్వకుండా అధికారులు చూసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!