Yogi Adityanath: బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగి వార్నింగ్..
- బక్రీద్ రోజు రోడ్డుపై నమాజ్ చేయొద్దు..
- మాఫియా అణిచివేత కొనసాగుతుంది..
- రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం యోగి సమీక్ష..
Yogi Adityanath: నేరగాళ్లు, మాఫియా అణిచివేతను కొనసాగిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. అణిచివేత చర్యలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ‘‘ప్రతి పేద, దోపిడి, అణగారిన మరియు అణగారిన వ్యక్తి ప్రయోజనాలను పరిరక్షించడం మా బాధ్యత, అది ల్యాండ్ మాఫియా లేదా మరేదైనా మాఫియా అయినా, చర్యలు తీసుకుంటాము’’ గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో సమన్వయం చేసుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని పొందాలని అధికారుల్ని ఆదేశించారు.
Read Also: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
Also Read
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
జిల్లా, మండల స్థాయిల్లో జనతా దర్శన్ కార్యక్రమాలనున వెంటనే ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. అవినీతికి వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీకి అనుగుణంగా, రాష్ట్ర సచివాలయం నుండి బ్లాక్ స్థాయి వరకు అనైతిక లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతిభద్రతలను సమీక్షించారు.
వీఐపీ కల్చర్ను ప్రోత్సహించరాదని, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో హూటర్లు, ప్రెషర్ హారన్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే ఉత్సవాల్లో శాంతి సామరస్యాలు కాపాడుకోవాలని నొక్కి చెప్పారు. జూన్ 16న గంగా దసరా, జూన్ 17న బక్రీద్, జూన్ 18న జ్యేష్ఠ మాసం మంగళ్ పండుగ, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో శాంతి భద్రతలపై అధికారులకు సూచనలు చేశారు. రానున్న బక్రీద్ పండుగల సందర్భంగా రోడ్డుపై నమాజ్ చేయరాదని, నిషేధిత జంతువులను వధిస్తే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. బక్రీద్ రోజున జంతువుల్ని బలి ఇచ్చే ప్రదేశాలను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లోనే బలి ఇవ్వాలని, నిషేధిత జంతువులను బలి ఇవ్వకుండా అధికారులు చూసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!