Kishan Reddy: ఆందోళన వద్దు.. సురక్షితంగా భారత్కు తీసుకొస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని తీసుకు రావడానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని తెలిపారు కిషన్రెడ్డి.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్లో 423 మంది ఏపీ విద్యార్థులు..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఉక్రెయిన్ చుట్టు పక్కల ఉన్న దేశాల్లో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. విద్యార్థులను సొంత ఖర్చులతో ఇండియాకి తీసుకొస్తున్నాం.. భారత జెండా కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రష్యాతో ఒప్పందం చేసుకున్నామన్నారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు… ఆలస్యం అయినా ఎవరికి హాని కలగ కుండా ఇండియాకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకొవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలిపారని గుర్తుచేసిన కిషన్రెడ్డి.. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ రెండూ దేశాలు మనకు మిత్ర దేశాలే.. మనకు శత్రువు ఒక పాకిస్థాన్ మాత్రమేనని.. ఆందోళన వద్దు.. అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేరుస్తాం అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!