Kishan Reddy: ఆందోళన వద్దు.. సురక్షితంగా భారత్కు తీసుకొస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని తీసుకు రావడానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని తెలిపారు కిషన్రెడ్డి.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్లో 423 మంది ఏపీ విద్యార్థులు..
Also Read
ఉక్రెయిన్ చుట్టు పక్కల ఉన్న దేశాల్లో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. విద్యార్థులను సొంత ఖర్చులతో ఇండియాకి తీసుకొస్తున్నాం.. భారత జెండా కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రష్యాతో ఒప్పందం చేసుకున్నామన్నారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు… ఆలస్యం అయినా ఎవరికి హాని కలగ కుండా ఇండియాకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకొవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలిపారని గుర్తుచేసిన కిషన్రెడ్డి.. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ రెండూ దేశాలు మనకు మిత్ర దేశాలే.. మనకు శత్రువు ఒక పాకిస్థాన్ మాత్రమేనని.. ఆందోళన వద్దు.. అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేరుస్తాం అని వెల్లడించారు.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!