Jodhpur clashes: జోధ్పూర్ ఘర్షణలు.. చర్యలకు కేంద్రమంత్రి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోధ్పూర్ ఘర్షణల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే… పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. కావాలనే కొంతమంది అల్లర్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. కార్లను ధ్వంసం చేయడం, ఇళ్లపై రాళ్లతో దాడి చేయడం, మహిళలను అవమానించడం వంటివి జరిగాయన్నారు. అల్లర్లకు అరికట్టడంలో… రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యాయన్నారు. రాత్రి అల్లర్లు జరిగినా… ఉదయానికి కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, రాజస్థాన్లోని జోధ్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల మధ్య సోమవారం రాత్రి నుంచి మొదలైన ఘర్షణలు.. మంగళవారం ఈదుల్ ఫితర్, అక్షయ తృతీయ పండగులు జరుపుకుంటున్న వేళ కూడా కొనసాగాయి. దీంతో పోలీసులు, అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారిపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. జోధ్పూర్లోని జలోరి గేట్ ఇంటరాక్షన్ సర్కిల్ బల్ముకోండ బిస్సా వద్ద ఓ ప్రార్థనా స్థలంపై మరో వర్గానికి చెందిన జెండా ఎగురవేయడమే ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. లౌడ్ స్పీకర్లను తొలగించారు. రాళ్ల దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ఘర్షణలు హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, అవాస్తవ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బల్క్ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సేవలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. జోధ్పూర్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో.. పోలీసులు కర్ఫ్యూ విధించారు. పండుగ వేళ ఈ ఘర్షణలు విచారకరమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. శాంతిభద్రతలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..