NTV Telugu Site icon

Amit Shah: నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ..

Amith Shah

Amith Shah

Amit Shah: నేడు (సోమవారం) కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోవామపక్ష ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం కొనసాగనుంది. ఈ మీటింగ్ కు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యంత్రులు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకాబోతున్నారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Read Also: Off The Record : హైడ్రా కూల్చివేతలతో రాజకీయ ప్రకంపనలు..Congress ను టార్గెట్ చేసిన

అలాగే, త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌ అభయారణ్యంలో ఆపరేషన్ సైతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమిత్ షా నిర్వహించే ఈ భేటీకి ఉభయ రాష్ట్రాల మంత్రులు హాజరుకాబోతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరుకానుండగా.. ఏపీ నుంచి హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావుల పాల్గొననున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ మంత్రులు, అధికారులు హాజరవుతారు.