Union Cabinet Decisions : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఏకంగా రూ. 8.8 లక్షల కోట్ల విలువైన ఆరు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, సామాన్యుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచనున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలు భవిష్యత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
జల జీవన్ మిషన్ 2.0.. ఇంటింటికీ గంగమ్మ
ఈ కేబినెట్ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం ‘జల జీవన్ మిషన్ 2.0’ ప్రారంభం. దీని కోసం ప్రభుత్వం సుమారు రూ. 8.7 లక్షల కోట్లను కేటాయించింది. 2019లో ప్రారంభమైన మొదటి దశలో ఇప్పటికే 81 శాతం గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు అందగా, ఇప్పుడు రెండో దశ ద్వారా మిగిలిన ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అదనంగా లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
తమిళనాడులోని ఆధ్యాత్మిక, చారిత్రక నగరమైన మధురైకి కేంద్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది. మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం దక్షిణ తమిళనాడు అభివృద్ధికి సరికొత్త రెక్కలు తొడిగింది. దీనివల్ల మీనాక్షి అమ్మన్ ఆలయం, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా, మధురై చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక, విద్యా , వైద్య హబ్లకు అంతర్జాతీయ స్థాయి అనుసంధానం లభించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
రైల్వే నెట్వర్క్ విస్తరణ, ఆధునీకరణ
దేశవ్యాప్తంగా రైళ్ల రద్దీని తగ్గించి, రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 4,474 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని సాయింతియా-పాకూర్ , సంత్రాగచి-ఖరగ్పూర్ విభాగాల్లో నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ అదనపు లైన్ల వల్ల కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, బొగ్గు , ఇతర సరుకు రవాణా కూడా వేగవంతం కానుంది. ఇది భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
రహదారి కనెక్టివిటీకి పెద్దపీట
రవాణా రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో మధ్యప్రదేశ్లో కొత్తగా ఫోర్ లేన్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్హెచ్-752డి (NH-752D) పరిధిలో బద్నావర్ నుండి తిమర్వానీ వరకు 80 కిలోమీటర్ల మేర నిర్మించబోయే ఈ రహదారి ఉజ్జయిని నగరాన్ని ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేతో నేరుగా అనుసంధానిస్తుంది. దీనితో పాటు, ఉత్తరప్రదేశ్లోని జేవార్ విమానాశ్రయాన్ని ఫరీదాబాద్తో కలిపే ఎలివేటెడ్ రోడ్డు ప్రాజెక్టును కూడా ఆమోదించారు. ఈ నిర్ణయాలన్నీ కలిపి దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.
Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..
Boosting rail connectivity and capacity in eastern India!
Cabinet has approved multitracking projects covering 5 districts of West Bengal and Jharkhand. These projects will enhance efficiency, reduce congestion and strengthen connectivity across these states. They will also…
— Narendra Modi (@narendramodi) March 10, 2026
A significant step for Tamil Nadu’s growth and connectivity!
The Union Cabinet has approved the declaration of Madurai Airport as an International Airport. This will boost tourism, trade and economic opportunities across Southern Tamil Nadu in particular. Madurai, a city…
— Narendra Modi (@narendramodi) March 10, 2026