Reservation: “ప్రైవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్”.. వివాదాస్పద చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లను హర్యానా రాష్ట్రంలోని నివాసితులకు కేటాయించారు. నివాసం ఉండాల్సిన సంవత్సరాలను 15 నుంచి 5 ఏళ్లకు తగ్గించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల ఓట్లను సంపాదించాలని అనుకున్న మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తాకినట్లైంది. ఈ తీర్పుపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
నవంబర్ 2020లో హర్యానా అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టం, మార్చి 2021లో గవర్నర్ ఆమోదం పొందింది, ఇది రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ, దాని అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాల ఆలోచన నుంచే ఈ బిల్లు పుట్టింది. 2019 ముందు ఆయన ఈ హమీ ఇచ్చారు.
Read Also: Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
తక్కువ జీతం ఉండే ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సామాజికంగా, ఆర్థికంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలుగా పేర్కొంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా గురుగ్రామ్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్, ఇతర యాజమాన్య సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇది యజమానుల రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ సూత్రాలకు విరుద్ధమని కూడా వారు పేర్కొన్నారు. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ కారిడార్ ఉన్న గురుగ్రామ్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఫిబ్రవరి 2022లో ఈ చట్టంపై స్టే విధించింది. హర్యానా ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసిన రోజుల తర్వాత ఆ ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన న్యాయమూర్తులు జిఎస్ సంధావాలియా, హర్ప్రీత్ కౌర్ జీవన్లతో కూడిన ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని కొట్టివేసింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!