Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ సీఎం ఉమాభారతి సొంతపార్టీపైనే ఉద్యమాన్ని చేస్తున్నారు.. గత కొంత కాలంగా మద్యపాన నిషేధంపై పోరాటం చేస్తున్న ఆమె… తాజాగా, మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలోని ఓర్చా పట్టణంలోని ఒక మద్యం షాపుపై ఆవు పేడను విసిరారు, బీజేపీ పాలిత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఉమాభారతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మద్యం షాపు ఉన్న ప్రదేశం ఆమోదయోగ్యమైనది కాదు.. పవిత్ర పట్టణమైన ఓర్చాలో ఇలాంటి దుకాణాన్ని తెరవడం నేరం అని పేర్కొన్నారు.
Read Also: Vizag: ఆర్కే బీచ్ రోడ్డులో కారు బీభత్సం
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
రాష్ట్ర రాజధాని భోపాల్కు 330 కి.మీ దూరంలో ఉన్న రామరాజ ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఓర్చా.. ఇక్కడ మంగళవారం సాయంత్రం ఉమాభారతి మద్యం షాపుపై ఆవు పేడ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది.. ఆ క్లిప్లో ఉమాభారతి వీడియో షూట్ చేస్తున్న వ్యక్తితో.. చూడండి, నేను ఆవు పేడను విసిరాను.. రాళ్లు వేయలేదు అని చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉమాభారతి.. భోపాల్లోని ఓ మద్యం దుకాణంపై రాయి విసిరిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి వరుస ట్వీట్లలో.. ఓర్చా ప్రధాన ద్వారం వద్ద ఉన్న మద్యం దుకాణం ఉన్న ప్రాంతం ఆమోదించబడలేదు, కానీ, సుదూర గ్రామానికి ఆమోదించబడింది. ప్రజలు మరియు మా సంస్థ సభ్యులు దీనికి వ్యతిరేకంగా నిరంతరం నిరసనలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
మరో ట్వీట్లో, ప్రజలు ప్రభుత్వానికి మెమోరాండంలు సమర్పించారని.. ఈ దుకాణాన్ని తొలగించాలని పాలకులకు పదే పదే విజ్ఞప్తి చేశారని, ఎందుకంటే ఈ పవిత్ర నగరం యొక్క నుదిటిపై ఇది పెద్ద కళంకంగా పేర్కొన్నారు ఉమాభారతి. అన్ని విధాలుగా, ఈ దుకాణానికి వ్యతిరేకంగా ప్రజల ప్రతిస్పందనను నేరంగా పేర్కొనలేం, ఎందుకంటే ఇక్కడ (మతపరమైన స్థలంలో) మద్యం దుకాణాన్ని తెరవడం పెద్ద నేరం అన్నారు. ఓర్చాలో నిర్వహించిన ‘దీపోత్సవ్’ కార్యక్రమంలో రామనవమి నాడు ఐదు లక్షల దీపాలను వెలిగించినప్పుడు ఈ దుకాణం తెరిచి ఉందని తనకు సమాచారం వచ్చిందని గుర్తుచేశారు.. ఇది అయోధ్య వలె పవిత్రంగా పరిగణించబడుతుంది.. అందుకే నేను ఒక పవిత్రమైన గోశాల నుండి కొంత ఆవు పేడను మద్యం దుకాణంపై విసిరినట్టు పేర్కొన్నారు ఉమాభారతి.
6. शराबबंदी राजनीतिक नहीं सामाजिक अभियान है। समाज की शक्ति और एकता से ही इसका समाधान होगा, किंतु ओरछा के दरवाजे पर रामराजा सरकार के दर्शन के लिए आते और जाते हुए यह शराब की दुकान हमारी रामभक्ति को चुनौती दे रही है। pic.twitter.com/2Y7vlRuBLn
— Uma Bharti (@umasribharti) June 14, 2022
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..