Indian Army: ఉల్ఫా ఉగ్రవాదులపై ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’తో మాకు సంబంధం లేదు: భారత సైన్యం
- భారత-మయన్మార్ సరిహద్దుల్లోని ఉల్ఫా ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్..
- ముగ్గుర కీలక నేతలు హతం, భారత సైన్యమే చేసిందని ఆరోపణ..
- ఈ దాడులకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆర్మీ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: భారతదేశానికి వ్యతిరేకంగా వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న నిషేధిత “యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఇండిపెండెంట్)” లేదా “ఉల్ఫా” ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు జరిగాయి. మయన్మార్లోని సాగైయాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కీలకమైన ఉల్ఫా ఉగ్రవాదులు మరణించారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం జరిపిందని, ఆదివారం ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని భారత సైన్యం ఖండించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర పోలీసులు ఎలాంటి దాడిలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.
Also Read
చర్చలకు వ్యతిరేకంగా ఉల్ఫాలోని ఒక వర్గం సాయుధపోరాటం ద్వారా అస్సాంను భారత్ నుంచి వేరు చేయాలని ఉద్యమిస్తోంది. ఇది భారత సరిహద్దుల్లోని మయన్మార్లో మొబైల్ శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చీఫ్ పరేష్ బారువా నేతృత్వంలో పనిచేస్తోంది. ఇతను మయన్మార్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటాడనే సమాచారం ఉంది. మొత్తం 150 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో ముగ్గురు అగ్ర నాయకులు చనిపోయినట్లు ఉల్ఫా చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
ఉల్ఫా లోయర్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన నయన్ అసోమ్ అలియాస్ నయన్ మేధీ డ్రోన్ దాడిలో మరణించాడు. దాదాపు 19 మంది గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, కొన్ని నివేదికల ప్రకారం, దాడిలో ఇజ్రాయిల్, ఫ్రెంచ్ డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపాయి. 2019లో భారతదేశం మయన్మార్తో కలిసి ఆపరేషన్ సన్రైజ్ అనే కోడ్నేమ్తో సరిహద్దుల్లో ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో ఉల్ఫా, నాగా ఉగ్రవాద సంస్థలైన NSCN ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!