ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి ఒలెనా జెలెన్స్కీ జైపూర్లో ప్రత్యక్షమయ్యారు. జపాన్కు వెళ్తున్న తరుణంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం జైపూర్లో ల్యాండ్ అయింది.

23 మంది ఉక్రెయిన్ సభ్యుల బృందం జపాన్ వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న విమానం.. ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనా ఉన్నారు. ఆమెతో పాటు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఇంధనం నింపుకున్న తర్వాత ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరిగి విమానం బయల్దేరి వెళ్లింది. విమానం జపాన్లోని టోక్యోకు వెళ్తోంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ కుమారుడి టీ షర్ట్ వైరల్..! అర్థమిదేనా?
విమానంలో ఇంధనం నింపుకునేందుకు ఉక్రెయిన్ విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందస్తుగా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ సభ్యులకు అవసరమైన ప్రోటోకాల్ను ఆమోదించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఆదేశించింది. దీంతో విమానం ఉదయం 6:30 గంటలకు జైపూర్లో ల్యాండ్ అయింది. రెండు గంటల అనంతరం తిరిగి విమానం జపాన్కు బయల్దేరి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
విశిష్ట అతిథితో పాటు ప్రతినిధి బృందం సభ్యులకు అవసరమైన మర్యాదలు కూడా చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో బృందంలోని సభ్యులకు ఎలాంటి తనిఖీలు లేకుండానే సకల సౌకర్యాలు అందించబడ్డాయి. 23 మంది సభ్యుల బృందంలో ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి సెర్గి కిస్లిట్సా, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి ఒలెక్సీ సోబోలెవ్ కూడా ఉన్నారు. విమానంలో ఇంధనం నింపుకునేంత వరకు రెండు గంటల పాటు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో ఉక్రెయిన్ బృందానికి సకల మర్యాదలు జరిగాయి. వీరికి స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం అధికారులు కూడా వచ్చారు.
రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతోంది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్ బృందం అంతర్జాతీయ పర్యటన చేపట్టింది. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు జపాన్ పర్యటన చేపట్టింది. అంతేకాకుండా ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో సహాయం కూడా చేయాలని జపాన్ను కోరనున్నారు. ఇక జపాన్, ఉక్రెయిన్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. 1992 నుంచి జపాన్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. అవసరమైతే దౌత్యం కూడా చేస్తామని మోడీ ప్రకటించారు.