UK PM: భారత్ ‘‘గ్రేట్ ఎకానమి’’.. ట్రంప్ వ్యాఖ్యలకు యూకే ప్రధాని కౌంటర్..
- 2028 నాటికి మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా భారత్..
- భారత ఆర్థిక వ్యవస్థపై యూకే ప్రధాని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ప్రస్తుతం, యూకే ప్రధాని భారత పర్యటనలో ఉన్నారు. హిందీలో స్వాగతంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కీర్ స్టార్మర్, భారత్ వృద్ధి గురించి ప్రశంసలు కురిపించారు. భారత అభివృద్ధి ప్రయాణంలో యూకే భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘‘నమస్కార్ దోస్తాన్.. 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నాయకత్వంపై నేను ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. 2047 నాటికి దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మీ లక్ష్యం” అని భారతదేశానికి తొలిసారిగా వచ్చిన యూకే ప్రధానమంత్రి అన్నారు.
Also Read
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
Read Also: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
ఇటీవల, భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘చనిపోయినది’’గా అభివర్ణించారు. అయితే, తాజాగా కీర్ స్టార్మర్ తన పర్యటనలో 100 మందికి పైగా సీఈఓలు, ఎంటర్ప్రెన్యూర్లు, యూనివర్సిటీ ఛాన్సలర్లతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో భారత పర్యటనకు వచ్చారు. దీనిని గమనిస్తే, భారత్ అభివృద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వృద్ధి 6 శాతానికి మించి ఉంటుందని అంచనా వేసింది.
మరోవైపు, యూకే ప్రధాని ఐక్యరాజ్యసమితిలో సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం..అమెరికా, చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యాలు శాశ్వత సభ్య హోదాను కలిగి ఉన్నాయి. భారత్ సభ్యత్వానికి ప్రతీసారి చైనా మోకాలడ్డుతోంది. మిగతా దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి.
తాజావార్తలు
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?