UK PM: భారత్ ‘‘గ్రేట్ ఎకానమి’’.. ట్రంప్ వ్యాఖ్యలకు యూకే ప్రధాని కౌంటర్..
- 2028 నాటికి మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా భారత్..
- భారత ఆర్థిక వ్యవస్థపై యూకే ప్రధాని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ప్రస్తుతం, యూకే ప్రధాని భారత పర్యటనలో ఉన్నారు. హిందీలో స్వాగతంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కీర్ స్టార్మర్, భారత్ వృద్ధి గురించి ప్రశంసలు కురిపించారు. భారత అభివృద్ధి ప్రయాణంలో యూకే భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘‘నమస్కార్ దోస్తాన్.. 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నాయకత్వంపై నేను ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. 2047 నాటికి దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మీ లక్ష్యం” అని భారతదేశానికి తొలిసారిగా వచ్చిన యూకే ప్రధానమంత్రి అన్నారు.
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
Read Also: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
ఇటీవల, భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘చనిపోయినది’’గా అభివర్ణించారు. అయితే, తాజాగా కీర్ స్టార్మర్ తన పర్యటనలో 100 మందికి పైగా సీఈఓలు, ఎంటర్ప్రెన్యూర్లు, యూనివర్సిటీ ఛాన్సలర్లతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో భారత పర్యటనకు వచ్చారు. దీనిని గమనిస్తే, భారత్ అభివృద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వృద్ధి 6 శాతానికి మించి ఉంటుందని అంచనా వేసింది.
మరోవైపు, యూకే ప్రధాని ఐక్యరాజ్యసమితిలో సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం..అమెరికా, చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యాలు శాశ్వత సభ్య హోదాను కలిగి ఉన్నాయి. భారత్ సభ్యత్వానికి ప్రతీసారి చైనా మోకాలడ్డుతోంది. మిగతా దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి.
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?