Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..
- ‘‘నేను క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’..
- ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
- అన్ని మతాలు తనకు సమానం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
‘‘ గత సంవత్సరం ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నేను క్రైస్తవుడిని అని గర్వంగా చెప్పాను. ఇది చాలా మంది సంఘీలను చికాకు పెట్టింది. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని గర్విస్తున్నాను’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే, నేను క్రైస్తవుడిని. నేను ముస్లిం అని మీరు అనుకుంటే, నేను ముస్లింనే. నేను హిందువునని మీరు అనుకుంటే, నేను హిందువునే. నేను అందరికీ కామన్. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించమని మాత్రమే బోధిస్తాయి’’ అని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
Read Also: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!
ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఉదయనిధి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఒక న్యాయమూర్తి మతం పట్ల విద్వేషంతో మాట్లాడటం మనం చూశాం. అలహాబాద్ జడ్జి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి న్యాయమూర్తి పదవి ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అతడి నుంచి న్యాయాన్ని ఎలా ఆశించగలం’’ అని అన్నారు. ఆయనను తొలగించడానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు మద్దతుగా సంతకాలు చేయగా, ఎఐడీఎంకే మద్దతు ఇవ్వలేదని, ఆ పార్టీ బీజేపీ బానిసలా పనిచేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ-ఏఐడీఎంకే కూటమి రహస్య బంధం కొనసాగుతోందని అన్నారు. ఏఐడీఎంకే రాజ్యాంగ విలువల కన్నా రాజకీయ విధేయతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గతేడాది ఉదయనిధి ‘‘సనాతన ధర్మాన్ని’’ డెంగ్యూ, మలేరియాలో పోల్చుతూ, నిర్మూలించాలని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!