Maharashtra: హిందీ భాషపై పోరాటానికి ఉద్ధవ్, రాజ్ థాక్రే సన్నాహాలు.. శరద పవార్ మద్దతు
- మహారాష్ట్రలో హిందీ భాషపై రగడ
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- పోరాటానికి ఉద్ధవ్, రాజ్ థాకర్ సన్నాహాలు
- మద్దతు ప్రకటించిన శరద పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిభాషా రగడ ఇప్పుడు తమిళనాడు నుంచి మహారాష్ట్రకు మళ్లింది. త్రిభాషా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం 1-5 తరగతుల్లో మరాఠీ, ఆంగ్లంతో పాటు హిందీని తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైమరీ స్కూళ్లలో హిందీని తప్పని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. జూలై 5న ఎంఎన్ఎస్, జూలై 7న వసేన (యూబీటీ) నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ప్రకటించాయి. అయితే ఈ ఉద్యమంలో మిగతా పార్టీలను కూడా కలుపుకుంటారని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రేను విలేకర్లు అడగగా అందుకు సమ్మతించారు. విపక్ష పార్టీలను కలుపుకుని పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో తిరిగి ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి పోరాటానికి ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం..!
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
ఇక ఈ పోరాటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక పోస్టు చేశారు. మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీ విధించడాన్ని వ్యతిరేకంగా ఐక్యంగా మార్చ్ జరగబోతుంది. జై మహారాష్ట్ర!’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఉద్ధవ్ థాక్రే, రాజ్ థ్రాకే ఒకే వేదికపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్, రాజ్ థాక్రే కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తొలుత జూలై 6న నిరసన ప్రదర్శన చేపట్టాలని ప్రకటించాయి. ఆ రోజున ఆషాఢ ఏకాదశి కారణంగా జూలై 5కి సవరించారు.
ఇది కూడా చదవండి: RAPO 23 : రూటు మార్చిన రామ్ పోతినేని.. యంగ్ దర్శకుడికి ఛాన్స్?
महाराष्ट्रतील शाळांत हिंदी सक्ती विरोधात एकच आणि एकत्र मोर्चा निघेल!
जय महाराष्ट्र! pic.twitter.com/A8ATq2ra0k— Sanjay Raut (@rautsanjay61) June 27, 2025
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!