Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ బెట్టింగ్ అంతా గుట్టుగా సాగిపోతుంటుంది.. గుట్టు చప్పుడు కాకుండా.. వందలు, వేలు, లక్షలు.. ఇలా వారికి స్టేటస్ను బట్టి బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.. పోలీసులు నిఘా పెట్టినా.. ఎంతో మందిని అరెస్ట్ చేసినా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది.. బూర్గంపాడు మండలంలో క్రికెట్ కేంద్రంగా రెచ్చిపోయింది బెట్టింగ్ గ్యాంగ్.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా.. వారికి ఆస్పత్రిలో చేర్చారు స్థానికులు.. ఇక, ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్.. ఎక్కడ..? ఎందుకంటే..?
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా వ్యహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది, క్రికెట్ ఆటని అడ్డగా చేసుకొని బెట్టింగ్ కు పాల్పడిన ఇరువర్గాలలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసిన ఘటన బూర్గంపాడు మండలం తాళ్ల గోమ్మూరులో చోటుచేసుకుంది.. బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మురులో ఆదివారం జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ వివాదానికి కారణమైంది, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ పాల్పడిన వారు డబ్బులు చెల్లించకపోవడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, డబ్బులు చెల్లించకపోవడంతో బెట్టింగ్ కు పాల్పడిన వారి ఇంట్లోకి చొరబడి మరి దాడి చేయడం సంచలనం సృష్టిస్తుంది, కొంతమంది యువకులు సినీ పక్కిలో చేసిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.. ఈ దాడిలో తాళ్ల గోమ్మూరుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..