Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ బెట్టింగ్ అంతా గుట్టుగా సాగిపోతుంటుంది.. గుట్టు చప్పుడు కాకుండా.. వందలు, వేలు, లక్షలు.. ఇలా వారికి స్టేటస్ను బట్టి బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.. పోలీసులు నిఘా పెట్టినా.. ఎంతో మందిని అరెస్ట్ చేసినా.. ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది.. బూర్గంపాడు మండలంలో క్రికెట్ కేంద్రంగా రెచ్చిపోయింది బెట్టింగ్ గ్యాంగ్.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా.. వారికి ఆస్పత్రిలో చేర్చారు స్థానికులు.. ఇక, ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్.. ఎక్కడ..? ఎందుకంటే..?
Also Read
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా వ్యహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది, క్రికెట్ ఆటని అడ్డగా చేసుకొని బెట్టింగ్ కు పాల్పడిన ఇరువర్గాలలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసిన ఘటన బూర్గంపాడు మండలం తాళ్ల గోమ్మూరులో చోటుచేసుకుంది.. బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మురులో ఆదివారం జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ వివాదానికి కారణమైంది, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ పాల్పడిన వారు డబ్బులు చెల్లించకపోవడంతో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, డబ్బులు చెల్లించకపోవడంతో బెట్టింగ్ కు పాల్పడిన వారి ఇంట్లోకి చొరబడి మరి దాడి చేయడం సంచలనం సృష్టిస్తుంది, కొంతమంది యువకులు సినీ పక్కిలో చేసిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.. ఈ దాడిలో తాళ్ల గోమ్మూరుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!