Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..
- ఉద్దవ్
- కాంగ్రెస్
- ఎన్సీపీ కలిపి పోటీ చేస్తాం..
- శరద్ పవార్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ(ఎస్) పార్టీలు కలిసి పోటీ చేస్తాయని శరద్ పవార్ ఆదివారం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ సర్కార్ని గద్దె దించాలని అనుకుంటోంది. మహాయుతిలో బీజేపీ, శివసేన్(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలు ఉన్నాయి.
Read Also: Dating App Scams: డేట్ అని అమ్మాయిని కలవడానికి వెళ్లారో, జేబు ఖాళీ.. వెలుగులోకి “డేటింగ్ స్కామ్”..
Also Read
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోరాడుతామని చెప్పారు. సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చిస్తామని, తమకు మూడు నెలల సమయం ఉందని చెప్పారు. ప్రతిపక్ష కూటమికి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు మంచి ఊపును ఇచ్చాయి. 48 ఎంపీ స్థానాలతో యూపీ తర్వాత కీలకంగా ఉన్న మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 31 స్థానాలను గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, శివసేన(ఉద్ధవ్) 09, ఎన్సీపీ(శరద్ పవార్) 08 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమి కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో చీలికలు వచ్చాయి. 2019 నుంచి 2022 వరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నాయి. అయితే, శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటులో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే సీఎంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల్లో ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. శరద్ పవార్పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ బీజేపీ సర్కారుకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి.
తాజావార్తలు
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!