Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..
- ఉద్దవ్
- కాంగ్రెస్
- ఎన్సీపీ కలిపి పోటీ చేస్తాం..
- శరద్ పవార్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ(ఎస్) పార్టీలు కలిసి పోటీ చేస్తాయని శరద్ పవార్ ఆదివారం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ సర్కార్ని గద్దె దించాలని అనుకుంటోంది. మహాయుతిలో బీజేపీ, శివసేన్(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలు ఉన్నాయి.
Read Also: Dating App Scams: డేట్ అని అమ్మాయిని కలవడానికి వెళ్లారో, జేబు ఖాళీ.. వెలుగులోకి “డేటింగ్ స్కామ్”..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోరాడుతామని చెప్పారు. సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చిస్తామని, తమకు మూడు నెలల సమయం ఉందని చెప్పారు. ప్రతిపక్ష కూటమికి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు మంచి ఊపును ఇచ్చాయి. 48 ఎంపీ స్థానాలతో యూపీ తర్వాత కీలకంగా ఉన్న మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 31 స్థానాలను గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, శివసేన(ఉద్ధవ్) 09, ఎన్సీపీ(శరద్ పవార్) 08 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమి కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో చీలికలు వచ్చాయి. 2019 నుంచి 2022 వరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నాయి. అయితే, శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటులో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే సీఎంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల్లో ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. శరద్ పవార్పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ బీజేపీ సర్కారుకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి.
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!