Maharashtra Political Crisis: రెబెల్ మంత్రులకు షాక్..శాఖలు తొలగించిన ఉద్ధవ్ ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వేగంగా పరిణామాాలు మారుతున్నాయి. ప్రస్తుతం శివసేన సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గంగా చీలిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి రాజకీయం నడుపుతుండగా.. ఉద్ధవ్ వర్గం ముంబై కేంద్రంగా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, అసెంబ్లీలో శివసేన ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను తప్పించి అజయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ నియమించారు.
ఇదిలా ఉంటే రెబెల్ వర్గానికి షాక్ ఇచ్చాడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం రెబెల్ వర్గంలో ఉన్న ఎనిమిది మంది మంత్రుల శాఖలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, తుఫాన్ ముప్పు ఉండటంతో అందుబాటులో లేని 8 మంది మంత్రుల శాఖలను తొలగించినట్లు తెలుస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇదిలా ఉంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి షిండే వర్గం మద్దతు ఉపసహరించుకున్నట్లు, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయనట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భర్తరఫ్ చేయాలని గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖలు రాసింది షిండే వర్గం.
ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు పెంచారు ఏక్ నాథ్ షిండే. గతంలోని సంఘటనలను తవ్వుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం షిండే వర్గాన్ని ద్రోహులు అంటూ విమర్శిస్తుంటే.. బాలా సాహెబ్ ఠాక్రేను అరెస్ట్ చేసిన వారితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉద్ధవ్ ఠాక్రే ప్రోత్సహిస్తున్నారని..వారికి మద్దతు ఇవ్వడం అంటే బాల్ ఠాక్రేను అవమానించడమే అంటూ షిండే విమర్శలు చేశారు. ఇటు శివసేన బీజేపీ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 50 కోట్లకు కొంటున్నారని ఆరోపణలు చేసింది. మహారాష్ట్రలో బీజేపీదే అధికారం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?