Maharashtra Political Crisis: రెబెల్ మంత్రులకు షాక్..శాఖలు తొలగించిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్రలో వేగంగా పరిణామాాలు మారుతున్నాయి. ప్రస్తుతం శివసేన సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గంగా చీలిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి రాజకీయం నడుపుతుండగా.. ఉద్ధవ్ వర్గం ముంబై కేంద్రంగా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, అసెంబ్లీలో శివసేన ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను తప్పించి అజయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ నియమించారు.
ఇదిలా ఉంటే రెబెల్ వర్గానికి షాక్ ఇచ్చాడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం రెబెల్ వర్గంలో ఉన్న ఎనిమిది మంది మంత్రుల శాఖలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, తుఫాన్ ముప్పు ఉండటంతో అందుబాటులో లేని 8 మంది మంత్రుల శాఖలను తొలగించినట్లు తెలుస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు.
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
ఇదిలా ఉంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి షిండే వర్గం మద్దతు ఉపసహరించుకున్నట్లు, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయనట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భర్తరఫ్ చేయాలని గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖలు రాసింది షిండే వర్గం.
ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు పెంచారు ఏక్ నాథ్ షిండే. గతంలోని సంఘటనలను తవ్వుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం షిండే వర్గాన్ని ద్రోహులు అంటూ విమర్శిస్తుంటే.. బాలా సాహెబ్ ఠాక్రేను అరెస్ట్ చేసిన వారితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉద్ధవ్ ఠాక్రే ప్రోత్సహిస్తున్నారని..వారికి మద్దతు ఇవ్వడం అంటే బాల్ ఠాక్రేను అవమానించడమే అంటూ షిండే విమర్శలు చేశారు. ఇటు శివసేన బీజేపీ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 50 కోట్లకు కొంటున్నారని ఆరోపణలు చేసింది. మహారాష్ట్రలో బీజేపీదే అధికారం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!