Celebi: మాకు టర్కీతో సంబంధాలు లేవు.. భారత్ నిర్ణయంపై కోర్టుకెక్కిన సెలెబి..
- ‘‘మాకు టర్కీతో సంబంధాలు లేవు’’..
- కేంద్రం నిర్ణయంపై టర్కీ విమానయాన సంస్థ సెలెబి..
- ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సెలెబి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ని వ్యాపారులు బ్యాన్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఇదిలా ఉంటే, భారతదేశంలోని 9 ఎయిర్ పోర్టు్ల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీస్ ప్రొవైడర్గా సేవలు అందిస్తున్న టర్కీ విమానయాన సంస్థ అయిన సెలెబి కి భారత్ అనుమతుల్ని రద్దు చేసింది. “జాతీయ భద్రత దృష్ట్యా” భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
Read Also: PAK Beggars: బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్.. 5 వేల మందిని వెనక్కి పంపిన సౌదీ..
అయితే, ఈ నిర్ణయంపై సెలెబి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేసింది. శుక్రవారం, సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ, అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను హేతుబద్ధంగా ఉదహరించారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక తెలిపింది. కేంద్రం నిర్ణయాన్ని పక్కన పెట్టాలని కోరుతూ.. ఇది 3,791 ఉద్యోగాలను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని కూడా పేర్కొంది.
గురువారం, కేంద్రం ప్రకటనకు స్పందించిన సెలెబీ, ‘‘తమది టర్కిష్ సంస్థ కాదని, ఏ విదేశీ ప్రభుత్వంతోనూ సంబంధాలు లేవని పేర్కొంది. సెలెబి వ్యాపారం నిజంగా భారతీయ సంస్థ అని, దీనిని భారతీయ నిపుణులు నడిపిస్తారని, మేము ఏ ప్రమాణాల ప్రకారం చూసినా టర్కిష్ సంస్థ కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడిన కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత పద్ధతులకు కట్టుబడి ఉన్నాము. ఏ విదేశీ ప్రభుత్వం లేదా వ్యక్తులతో ఎలాంటి ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేదా సంబంధాలు లేవు’’ అని ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?