Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- లెబనాన్లో హిజ్బుల్లాను ఆపండి..
- చర్యలు విఫలమైతే తీవ్రంగా దాడి చేస్తాం..
- ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక వైపు కొనసాగుతుంటే, మరోవైపు ట్రంప్ ఇరాన్కు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్లో ఇరాన్ ప్రాక్సీ హిజ్బుల్లాను వెంటనే ఆపాలని, లేదంటే గత వారం చేసినట్లే, ఈ సారి మరింత తీవ్రంగా ఇరాన్ను దెబ్బతీస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని, హార్ముజ్ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ప్రాంతీయ భద్రత, హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, పలు రంగాలలో కాల్పుల విరమణలపై విస్తృత చర్చలు నడుస్తున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
ప్రస్తుతం చర్చలు లెబనాన్పై ఇజ్రాయిల్ దాడుల పైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్, పాకిస్తాన్, ఖతార్లతో జరిగిన చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. లెబనాన్లో కాల్పుల విరమణ పరిరక్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం పురోగతి సాధించిందని, అయితే పరిస్థితి ఇప్పటికీ సున్నితంగానే ఉందని చెప్పారు. విస్తృత ప్రాంతీయ సంధిని సాధించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని, లెబనాన్ కాల్పుల విరమణ ఒక పరిష్కారం దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నట్లు వాన్స్ చెప్పారు. అమెరికాను చిరాకు పరిచే విధానాలను ఇరాన్ విడిచిపెడితే, ఆ దేశంతో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
అయితే, ఇరాన్ షరతులు నెరవేరితే తప్పా, చర్చల తదుపరి దశకు వెళ్లేందుకు సిద్ధిగా లేదు. కీలకమైన చర్చల్లో అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడుల్ని ఆపడం కీలకంగా మారాయి. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య దాడులు ఆపడంతో అమెరికా విఫలమైందని ఇరాన్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ప్రపంచ చమురుకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండటం చర్చల్ని సంక్లిష్టంగా మార్చాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!