Site icon NTV Telugu

Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Trump

Trump

Trump: ఇరాన్‌కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడానికి యుద్ధ నౌకల్ని పంపాలని మిత్రదేశాలను కోరారు.

అమెరికా దాడులు ఖార్గ్ ద్వీపంలోని చాలా భాగాన్ని “పూర్తిగా నాశనం చేశాయి” అని ట్రంప్ అన్నారు మరియు మరిన్ని దాడులు జరగవచ్చని, “మేము సరదా కోసం మరికొన్ని సార్లు దానిపై దాడి చేయవచ్చు” అని ప్రకటించారు. యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ, నిబంధనలు ఇంకా సరిపోవు అని ఆయన అన్నారు. ఖార్గ్ ద్వీపంపై దాడి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ప్రారంభించడానికి మిడిల్ ఈస్ట్‌లోని మిత్రదేవాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఖార్గ్ ద్వీపం ప్రత్యేకత:

ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖార్గ్‌పై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈలోని ఓడరేవులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖార్గ్ దీవి ఇరాన్ దక్షిణ తీరానికి సుమారుగా 30 కి.మీ దూరంలో ఉంది.

అయితే, ఖార్గ్ ద్వీపం అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఆయిల్ నిల్వలు, ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయలేదు. ఈ దాడి ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించామని అమెరికా చెబుతోంది.

Exit mobile version