Donald Trump: భారత్-పాక్ మధ్య “కాల్పుల విరమణ”కు నేనే కారణం.. ట్రంప్ నోట అదే మాట..
- భారత్ పాక్ మధ్య ఘర్షణ ఆపింది నేనే..
- వాణిజ్యంతో ‘‘కాల్పుల విరమణ’’కు అంగీకరించేలా చేశా..
- డొనాల్డ్ ట్రంప్ నుంచి మళ్లీ అవే మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాటలు చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను ఆపినందుకు ట్రంప్ తనకు తాను ఘనత వహించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ‘సుదీర్ఘ రాత్రి’ చర్చల తర్వాత భారత్, పాక్ ‘‘పూర్తి, తక్షణ’’ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదివారం ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గతంలో కూడా ట్రంప్ పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు.
Read Also: USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఘర్షణలను ముగించినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ తాజా వాదన వచ్చింది. దీనికి ఒక రోజు ముందు ట్రంప్ న్యూస్ మాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చాలా యుద్ధాలను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. వాణిజ్యంతో తాను యుద్ధాలను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం కవ్విస్తే, వారి ఎయిర్బేస్లపై విరుచుకుపడింది. అయితే, ఈ సంఘర్షణను తానే ఆపానని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే, ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని గతంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. కాల్పుల విరమణలో మూడవ పక్షం జోక్యం లేదని, పాకిస్తాన్ అడిగితేనే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ ప్రపంచ నాయకుడు కూడా భారత్ని కోరలేదని పార్లమెంట్లో ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!