USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- ట్రంప్ సహాయకుడి ఆరోపణలు..
- రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. “రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన (ట్రంప్) చాలా స్పష్టంగా చెప్పారు” అని మిల్లర్ అన్నారు. రష్యాతో భారత్ చమురు వాణిజ్యాన్ని చూసి ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్కి గురవుతారని, ఇది ఆశ్చర్యకరమైన వాస్తవం అని చెప్పారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..
అయితే, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన కొనుగోళ్లను ఆపడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జూలై 30న, డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. భారత్ రష్యన్ ఆయుధాలు, చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు’’గా అభివర్ణించాడు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రష్యా అంగీకరించకపోతే రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించే ఏ దేశం నుండి దిగుమతులపైనా 100% వరకు అధిక సుంకాలను విధించడాన్ని పరిశీలిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని చికాకు పరిచే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్ని వ్యూహాత్మక భాగస్వామిగా పిలిచారు. రాయిటర్స్ ప్రకారం, 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశ చమురులో 3% మాత్రమే రష్యా నుండి వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు దాని మొత్తం చమురు దిగుమతుల్లో 35% మరియు 40% మధ్య పెరిగింది.
తాజావార్తలు
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!