USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- ట్రంప్ సహాయకుడి ఆరోపణలు..
- రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. “రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన (ట్రంప్) చాలా స్పష్టంగా చెప్పారు” అని మిల్లర్ అన్నారు. రష్యాతో భారత్ చమురు వాణిజ్యాన్ని చూసి ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్కి గురవుతారని, ఇది ఆశ్చర్యకరమైన వాస్తవం అని చెప్పారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..
అయితే, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన కొనుగోళ్లను ఆపడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జూలై 30న, డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. భారత్ రష్యన్ ఆయుధాలు, చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు’’గా అభివర్ణించాడు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రష్యా అంగీకరించకపోతే రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించే ఏ దేశం నుండి దిగుమతులపైనా 100% వరకు అధిక సుంకాలను విధించడాన్ని పరిశీలిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని చికాకు పరిచే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్ని వ్యూహాత్మక భాగస్వామిగా పిలిచారు. రాయిటర్స్ ప్రకారం, 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశ చమురులో 3% మాత్రమే రష్యా నుండి వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు దాని మొత్తం చమురు దిగుమతుల్లో 35% మరియు 40% మధ్య పెరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!