USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
- ట్రంప్ సహాయకుడి ఆరోపణలు..
- రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. “రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన (ట్రంప్) చాలా స్పష్టంగా చెప్పారు” అని మిల్లర్ అన్నారు. రష్యాతో భారత్ చమురు వాణిజ్యాన్ని చూసి ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్కి గురవుతారని, ఇది ఆశ్చర్యకరమైన వాస్తవం అని చెప్పారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Read Also: Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..
అయితే, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన కొనుగోళ్లను ఆపడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జూలై 30న, డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. భారత్ రష్యన్ ఆయుధాలు, చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు’’గా అభివర్ణించాడు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రష్యా అంగీకరించకపోతే రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించే ఏ దేశం నుండి దిగుమతులపైనా 100% వరకు అధిక సుంకాలను విధించడాన్ని పరిశీలిస్తానని ట్రంప్ చెప్పారు. భారత్, అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని చికాకు పరిచే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్ని వ్యూహాత్మక భాగస్వామిగా పిలిచారు. రాయిటర్స్ ప్రకారం, 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశ చమురులో 3% మాత్రమే రష్యా నుండి వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు దాని మొత్తం చమురు దిగుమతుల్లో 35% మరియు 40% మధ్య పెరిగింది.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!