Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..
- ముస్లిం ప్రిన్సిపాల్ని తొలగించాలని స్కూల్ వాటర్లో విషం..
- కర్ణాటక బెళగావిలో సంచలనంగా మారిన సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక బెళగావిలో జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్ని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాలలోని నీటి ట్యాంక్లో విషం కలిపారు. జూలై 14న జరిగిన ఈ సంఘటనలో, శ్రీరామ్ సేన అనే మితవాద గ్రూపుతో అనుబంధం ఉన్న స్థానిక నాయకుడు సహా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హులికట్టిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్లో గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ చుట్టూ భయాందోళనలు, అనుమానాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యతో అతని ప్రతిష్టను దెబ్బతీసి, బలవంతంగా బదిలీ చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాల ట్యాంక్ నుండి నీరు తాగిన తర్వాత పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషం ప్రాణాంతకం కాకపోయినా, పాఠశాల అధికారులు, తల్లిదండ్రులలో ఆందోళన కలిగించాయి. పిల్లలకు వెంటనే చికిత్స అందించడంతో ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. విచారణలో ఐదో తరగతి పిల్లాడు నీటిలో విషం కలిపినట్లు గుర్తించారు. అయితే, పిల్లాడిని విచారించగా, నిందితులు వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ ట్యాంక్లో కలపాలని చెప్పినట్లు వెల్లడించాడు. ఆ బాటిల్ ఇచ్చిన వ్యక్తిని కృష్ణ మదార్గా గుర్తించారు.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
Read Also: Fighter jets: భారత్కు 5వ తరం ఫైటర్ జెట్స్ ఎందుకు అవసరం.. అమెరికా F-35, రష్యా su-57లో ఏది బెటర్..
విచారణలో కృష్ణను వేరే నిందితులు బెదిరించినట్లు తేలింది. తన కులాంతర ప్రేమను బయటపెడతారని బెదిరించడంతో తాను ఈ పనిచేశానని, సాగర్ పాటిల్, నాగన గౌడ పాటిల్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపాడు. ఒత్తిడికి గురైన కృష్ణ మదార్, పాఠశాల వాటర్ ట్యాంక్లో విషం కలపాలనే వారి డిమాండ్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామ సేన తాలూకా స్థాయి అధ్యక్షుడు సాగర్ పాటిల్ ఈ ఘటన వెనక మాస్టర్ మైండ్గా గుర్తించారు. ప్రిన్సిపాల్గా ముస్లిం వ్యక్తి ఉన్నాడనే కోపంతోనే పాటిల్ ఈ పనిచేసినట్లు అంగీకరించాడని పోలీసులు విచారణలో తేలింది. ముగ్గురు నిందితులు – సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ మరియు కృష్ణ మదార్లను అరెస్ట్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషప్రయోగ ప్రయత్నాన్ని ఖండించారు. దీనిని “మతపరమైన ద్వేషం మరియు మౌలికవాదం ద్వారా నడిచే హేయమైన చర్య” అని అభివర్ణిస్తూ, ఈ నేరం మత సామరస్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!