కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయంలో యుద్ధం సాగుతూనే వుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వ్యతిరేకంగా లోకసభలో ప్రివిలైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటు ను, దేశ ప్రజలని, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పెట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు.
నోటీసును స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు టీఆర్ ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్,మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత. పార్లమెంటు ఉభయ సభల్లోనూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై టీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
పారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో సభను తప్పుదోవ పట్టించారని నోటీసులు. భారత ప్రభుత్వం వెబ్ సైట్ ప్రకారం అనేక దేశాలకు పారా బాయిల్డ్ రైస్” ఎగుమతి చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎంపీలు.