Sandeshkhali: సీబీఐతో కలిసి బీజేపీ కుట్ర.. సందేశ్ఖాలీ రైడ్స్పై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో సందేశ్ఖాలీ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ అంశంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలు అక్కడి మహిళలపై లైంగిక అఘాయిత్యాలు, భూ కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహాన్ని 55 రోజుల పరారీ అనంతరం, కలకత్తా హైకోర్టు కలుగజేసుకోవడంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం సందేశ్ఖాలీ ప్రాంతంలో సీబీఐ భారీగా సోదాలు నిర్వహించింది. టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బాంబులు పట్టుబడ్డాయి. అయితే, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. పోలింగ్ రోజున సీబీఐ కావాలనే దాడులు సోదాలు నిర్వహించిందని చెప్పింది. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సీబీఐ, బీజేపీ కలిసి కుట్ర పన్ని ఈ సోదాలు నిర్వహించాయని తృణమూల్ శనివారం కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. టీఎంసీ ప్రతిష్టను దిగజార్చడానికి సీబీఐ అశాస్త్రీయంగా దాడి నిర్వహించిందని ఫిర్యాదు చేసింది.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: KCR: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
సోదాల్లో దొరికిన ఆయుధాలు నిజంగా స్వాధీనం చేసుకుందా..? లేదా..? అనే అనుమానాన్ని ఆ పార్టీ వ్యక్తపరిచింది. ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్రపరిధిలోకి వచ్చే అంశమని, అయినప్పటీకీ సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు అధికారులుకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదని టీఎంసీ వ్యాఖ్యానించింది. సందేశ్ఖాలీ హింసలో కీలక సూత్రధారి మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్ అనుచరుడి ప్రాంగణంలో సర్వీస్ రివాల్వర్, విదేశీ తుపాకులు, ఆయుధాలు లభించాయి.
రేషన్ కుంభకోణంలో భాగంగా విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై అప్పటి టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు జనవరిలో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడి మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా, హింస ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత 55 రోజుల వరకు కీలక నిందితుడు షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. చివరకు ఫిబ్రవరి 29న బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించలని బీజేపీ నాయకుడు సువేందు అధికారి శుక్రవారం కోరారు. సందేశ్ ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాలకు చెందినవే అని, ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఈ ఆయుధాలన్నింటిని అంతర్జాతీయ టెర్రరిస్టులు వాడుతున్నారని ఆరోపించారు. సందేశ్ ఖాలీ ఘటనకు పూర్తి బాధ్యత మమతా బెనర్జీదే అని అన్నారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?