West Bengal: సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు.. జెండా కర్రతో దాడికి దిగిన ఎమ్మెల్యే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.. తాజాగా, చిసురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్… పార్టీ కార్యకర్తలతో కలిసి జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
Also Read
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ మరియు అతని మద్దతుదారులు.. బీజేపీ కార్యకర్తలను కొట్టినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి.. ఆ ఆరోపణలను కొట్టిపారేసిన టీఎంసీ, బీజేపీ మద్దతుదారులచే శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారని ఆరోపించింది.. చిన్సురాలోని ఖాదినాన్ మోర్ వద్ద బీజేపీ ర్యాలీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మజుందార్పై బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని, అనవసరమైన ఆరోపణలు చేశారని.. దీంతో, వారిని తాను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.. వారు నా కారును ఆపి నన్ను కొట్టారు, ఆ తర్వాత మా మహిళా కార్మికులు జోక్యం చేసుకున్నారు” అని మజుందార్ తెలిపారు.. కానీ, ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నాం.. కానీ, ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులే తమపై దాడి చేశారని, కొట్టారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ‘వీధిలో ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలపై కర్రతో దాడి చేస్తే’ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..