West Bengal: సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు.. జెండా కర్రతో దాడికి దిగిన ఎమ్మెల్యే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.. తాజాగా, చిసురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్… పార్టీ కార్యకర్తలతో కలిసి జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ మరియు అతని మద్దతుదారులు.. బీజేపీ కార్యకర్తలను కొట్టినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి.. ఆ ఆరోపణలను కొట్టిపారేసిన టీఎంసీ, బీజేపీ మద్దతుదారులచే శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారని ఆరోపించింది.. చిన్సురాలోని ఖాదినాన్ మోర్ వద్ద బీజేపీ ర్యాలీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మజుందార్పై బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని, అనవసరమైన ఆరోపణలు చేశారని.. దీంతో, వారిని తాను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.. వారు నా కారును ఆపి నన్ను కొట్టారు, ఆ తర్వాత మా మహిళా కార్మికులు జోక్యం చేసుకున్నారు” అని మజుందార్ తెలిపారు.. కానీ, ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నాం.. కానీ, ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులే తమపై దాడి చేశారని, కొట్టారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ‘వీధిలో ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలపై కర్రతో దాడి చేస్తే’ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!