West Bengal: సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు.. జెండా కర్రతో దాడికి దిగిన ఎమ్మెల్యే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.. తాజాగా, చిసురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్… పార్టీ కార్యకర్తలతో కలిసి జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ మరియు అతని మద్దతుదారులు.. బీజేపీ కార్యకర్తలను కొట్టినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి.. ఆ ఆరోపణలను కొట్టిపారేసిన టీఎంసీ, బీజేపీ మద్దతుదారులచే శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారని ఆరోపించింది.. చిన్సురాలోని ఖాదినాన్ మోర్ వద్ద బీజేపీ ర్యాలీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మజుందార్పై బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని, అనవసరమైన ఆరోపణలు చేశారని.. దీంతో, వారిని తాను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.. వారు నా కారును ఆపి నన్ను కొట్టారు, ఆ తర్వాత మా మహిళా కార్మికులు జోక్యం చేసుకున్నారు” అని మజుందార్ తెలిపారు.. కానీ, ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నాం.. కానీ, ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులే తమపై దాడి చేశారని, కొట్టారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ‘వీధిలో ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలపై కర్రతో దాడి చేస్తే’ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!