Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
- తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి
- రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్పై దాడి జరిగింది. రషీద్పై ట్రాన్స్జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి. వాగ్వాదం తర్వాత రషీద్పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 2017లో జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదులు, ఉగ్రవాద గ్రూపులకు రషీద్ నిధులు సమకూర్చాడని రషీద్పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రషీద్ను అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
రషీద్పై దాడి జరిగినట్లు జైలు వర్గాలు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన తండ్రికి రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు రషీద్ కుమారుడు అబ్రార్ రషీద్ లేఖ రాశాడు. తన తండ్రిని చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రషీద్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. జైలు నెం.3లో ప్రస్తుతం ముగ్గురు ట్రాన్స్జెండర్ ఖైదీలు ఉన్నారు. వాగ్వాదం తర్వాత రషీద్పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు కుట్ర పన్నినట్లు వస్తున్న వార్తలను జైలు అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Kethireddy Pedda Reddy: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 15 నెలల తర్వాత సొంత ఇంటికి..!
రషీద్ దాడి విషయంలో న్యాయవాదిని కలవబోతున్నట్లు అబ్రార్ రషీద్ తెలిపారు. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదని.. జైల్లో ఉన్న అందరి భద్రత గురించి అడుగుతున్నట్లు అబ్రార్ రషీద్ కోరారు. తన తండ్రి పార్లమెంట్ సభ్యుడని.. భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. ఇక జైలు లోపల ఎలాంటి దాడి జరిగిందో వెల్లడించాలని అవామి ఇత్తెహాద్ పార్టీ డిమాండ్ చేసింది. జైల్లో కాశ్మీర్ ఖైదీలను-ట్రాన్స్జెండర్లు, గ్యాంగ్స్టర్లను ఒకే దగ్గర ఉంచడంతో కాశ్మీరీయులను వేధిస్తున్నారని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. హెచ్ఐవీ ట్రాన్స్జెండర్లతో కలిసి ఉంచడమేంటి? అని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!