Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
- తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి
- రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్పై దాడి జరిగింది. రషీద్పై ట్రాన్స్జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి. వాగ్వాదం తర్వాత రషీద్పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 2017లో జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదులు, ఉగ్రవాద గ్రూపులకు రషీద్ నిధులు సమకూర్చాడని రషీద్పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రషీద్ను అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
రషీద్పై దాడి జరిగినట్లు జైలు వర్గాలు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన తండ్రికి రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు రషీద్ కుమారుడు అబ్రార్ రషీద్ లేఖ రాశాడు. తన తండ్రిని చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రషీద్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. జైలు నెం.3లో ప్రస్తుతం ముగ్గురు ట్రాన్స్జెండర్ ఖైదీలు ఉన్నారు. వాగ్వాదం తర్వాత రషీద్పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు కుట్ర పన్నినట్లు వస్తున్న వార్తలను జైలు అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Kethireddy Pedda Reddy: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 15 నెలల తర్వాత సొంత ఇంటికి..!
రషీద్ దాడి విషయంలో న్యాయవాదిని కలవబోతున్నట్లు అబ్రార్ రషీద్ తెలిపారు. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదని.. జైల్లో ఉన్న అందరి భద్రత గురించి అడుగుతున్నట్లు అబ్రార్ రషీద్ కోరారు. తన తండ్రి పార్లమెంట్ సభ్యుడని.. భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. ఇక జైలు లోపల ఎలాంటి దాడి జరిగిందో వెల్లడించాలని అవామి ఇత్తెహాద్ పార్టీ డిమాండ్ చేసింది. జైల్లో కాశ్మీర్ ఖైదీలను-ట్రాన్స్జెండర్లు, గ్యాంగ్స్టర్లను ఒకే దగ్గర ఉంచడంతో కాశ్మీరీయులను వేధిస్తున్నారని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. హెచ్ఐవీ ట్రాన్స్జెండర్లతో కలిసి ఉంచడమేంటి? అని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!