Krishnamachari Srikkanth: “గంభీర్ ఇప్పటికైనా మారు”.. కోచ్ నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth: టీ20 ప్రపంచకప్లో భారత్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. మొదటి నుంచి వరుసగా మ్యాచ్లు గెలుస్తూ వచ్చిన సూర్య సేన సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో పడింది. సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్, జింబాబ్వేపై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే కోచ్ గంభీర్పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే.. తాజాగా 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలెక్టర్ కోచ్ గౌతమ్ గంభీర్కు కీలక సూచనలు చేశారు. గంభీర్ మరింత బాధ్యత తీసుకోవాలని సూచించారు. తుది జట్టును నిర్ణయించడం, వ్యూహాలు రూపొందించడం కోచ్ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. అక్షర్ పటేల్ను జట్టులో నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. వైస్ కెప్టెన్గా ఉన్న ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం ఎంత వరకు కరెక్ట్, శుభ్మన్ గిల్ విషయంలోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. ఇకపై టీ20ల్లో వైస్ కెప్టెన్ అవ్వడానికి ఎవరూ ముందుకు రారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఇదిలా ఉండగా.. మొన్న దక్షిణాఫ్రికా ఏకంగా 76 పరుగులు తేడాతో భారత్ను ఓడించింది. ఈ ఓటమి భారత టీ20 చరిత్రలో అత్యంత నిరాశాజనకమైన ఓటముల్లో ఒకటిగా శ్రీకాంత్ అభివర్ణించారు. 2022 సెమీఫైనల్ ఓటమి తర్వాత ఇదే అత్యంత చేదు ఫలితమని చెప్పారు. ఈ ఓటమితో జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారిందని, వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ ఫలితమూ భారత్కు ముఖ్యమైందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై భారత్ ఆదారపడాల్సి వచ్చిందని విమర్శించారు. ఇక సూపర్ 8లో భాగంగా భారత్కు రెండో అగ్ని పరీక్ష వెస్టిండీస్తో ఉండనుంది. ఈ రోజు వెస్టిండీస్తో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.
READ MORE: CABINET DECISSIONS Full Details: తెలంగాణలో మెగా నిర్ణయాలు.. ఎవరికెంత లాభం.?
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!