Jharkhand: కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
- జార్ఖండ్లో ఘోర విమాన ప్రమాదం
- కూలిన ఎయిర్ అంబులెన్స్
- ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్ర జిల్లాలోని సిమారియా సమీపంలో కూలిపోయింది. అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విమానం అదృశ్యమైందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఇది కూలిపోయిందని ఆమె తెలిపారు. విమానంలో ఉన్న ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు SDPO శుభం ఖండేల్వాల్ పేర్కొన్నారు. కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్గా గుర్తించారు.
DGCA వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్ రెడ్బర్డ్ ఆరు విమానాలను కలిగి ఉంది. ఇందులో క్రాష్ అయిన విమానం కూడా ఉంది. రాంచీలోని దేవ్కమల్ హాస్పిటల్ CEO అనంత్ సిన్హా మాట్లాడుతూ.. ఎయిర్ అంబులెన్స్ రోగి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని చెప్పారు.
‘‘లాతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ (41) అనే రోగి ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రోగి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరాడు.’’ అని అనంత్ సిన్హా అన్నారు.
టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘‘ప్రమాదానికి వాతావరణం బాగోలేకపోవడమే కారణం కావచ్చు. కానీ కచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!