మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్గా జరుగుతున్నాయి. అలాగే కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ.48 వేలు దాటింది.
read also : జులై 10 శనివారం దినఫలాలు : వ్యాపారస్తులకు పురోభివృద్ధి
ఇక ఇదిలా ఉంటే, హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే…. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.100 పెరిగి రూ. 44,750 కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,820 కి చేరుకుంది. బంగారం ధరలు పెరిగితే… వెండి ధరలు మాత్రం కొంతమేర తగ్గాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి 73,400కి చేరింది.