MP Yusuf Pathan: ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి.. అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ!
- ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి..
- కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన టీఎంసీ ఎంపీ..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూసఫ్ పఠాన్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Yusuf Pathan: ఒడిశా రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బెర్హంపూర్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిన రాష్ట్రం ఒడిశాలో భయంకరమైన పరిస్థితులతో బెంగాల్ రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన బెర్హంపూర్, ముర్షిదాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా కార్మికులు పారిపోయి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇక, వలసదారులపై జరిగిన హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ డిమాండ్ చేశారు.
Read Also: Dasari Awards: దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ఇక, బెంగాల్ కి చెందిన వలస కార్మికులపై రాత్రిపూట దాడి చేశారు.. వారి మొబైల్ ఫోన్లు, డబ్బులతో పాటు ఆధార్ కార్డులను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఎంపీ యూసఫ్ పఠాన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు 2024 ఆగస్టు-సెప్టెంబర్లలో కూడా జరిగాయని గుర్తు చేశారు. ప్రాంతీయ గుర్తింపు ఆధారంగా కార్మికులను, ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆ లేఖ హైలైట్ చేశారు. ఇటువంటి చర్యలు “మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలను” ఉల్లంఘించడమేనని యూసఫ్ పఠాన్ అభివర్ణించారు.
Read Also: Beauty Tips: వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే ఇన్ని లాభాలా?
అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై పట్టుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ కోరారు.
వలస కార్మికుల భద్రత, రక్షణను కాపాడాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కేంద్రం ఒక నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్కు తిరిగి వస్తున్న కార్మికులకు అవసరమైన పునరావాస సహాయం అందించడం జరుగుతుందని యూసుఫ్ పఠాన్ అన్నారు.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..