Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- టీఎంసీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం
- అన్ని కమిటీలు, అనుబంధ సంస్థలను రద్దు చేసిన మమత
- పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా మార్చనున్న టీఎంసీ
- అంతర్గత తిరుగుబాటు నేపథ్యంలో కీలక నిర్ణయం
- 16 అనుబంధ సంస్థలపై ఒకేసారి వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో ఉంది. పార్టీ సుప్రీమో మమతా బెనర్జీ మాట కూడా ఎమ్మెల్యేలు వినడం లేదు. మరోవైపు, మమత నుంచి పార్టీని, పార్టీ గుర్తును చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రెబల్ ఎమ్మెల్యేల ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పిలుపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. మంగళవారం కోల్కతాలో జరిగిన ధర్నాకు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు కేవలం ఐదుగురే హాజరు కావడం సంచలంగా మారింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ రెబల్ వర్గం దీదీకి ఎదురుతిరుగుతోంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీకి చెందిన అన్ని కమిటీలు, దాని అనుబంధ సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. పార్టీ అన్ని స్థాయిల్లో సమగ్రమైన ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత సమీక్ష ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పింది. దీని తర్వాత కమిటీలను పునర్నిర్మించి, తగిన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది.
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
అయితే, అసెంబ్లీ ఎన్నికత తర్వాత టీఎంసీ అగ్రనాయకత్వంలో చీలిక ఏర్పడిందని తెలుస్తోంది. అనుబంధ సంస్థలు హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కమిటీలను రద్దు చేసినట్లు తెలిసింది. టీఎంసీకి సుమారు 16 అనుబంధ సంస్థలు ఉన్నాయి. పార్టీలోని యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు మొదలైన వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఉ న్నాయి. ఇక కమిటీల విషయానికి వస్తే టీఎంసీకి ఒక ప్రధాన కార్యనిర్వాహక కమిటీ ఉంది. దీనికి తోడుగా కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా, బ్లాక్ కమిటీలు, క్రమశిక్షణా కమిటీ ఉన్నాయి. సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!