Kuwait: నన్ను భారత్కు రప్పించండి.. చిత్రహింసలు పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక్కడ చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకురాలేక.. దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలకు పెదవాళ్ళు వెళుతుంటారు. అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఒంటరి పోరాటానికి బయలుదేరుతారు. దీన్నే అలుసుగా తీసుకొని, కొందరు ఏజెంట్లు నేలపై ఆకాశం చూపించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడికెళ్ళాక ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తాము చూసుకుంటామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. పాపం.. వారి మాటలకు లొంగి, తమ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక, ఏజెంట్లు తమ అసలు రూపాన్ని బయటపెడతారు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా ఎర్రివారిపాలెం మండలం పెద్దవడ్డిపల్లికి చెందిన శ్రావణి అనే మహిళ.. ఉపాధి కోసం గత నెలలో కువైట్కి వెళ్ళింది. అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తాను జాగ్రత్తగా చూసుకుంటానని ఏజెంట్ చెంగల్రాజా ఆమె కుటుంబసభ్యుల్ని నమ్మించాడు. కువైట్లో ఉద్యోగం చేస్తే, తక్కువ సమయంలోనే భారీ డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపాడు. అతడు చెప్పిన మాటలు నమ్మి, ఆమె కువైట్కి వెళ్ళింది. ఒక నెల రోజుల వరకు అన్ని సవ్యంగానే సాగాయి. అయితే, ప్రస్తుత యజమాని తనని సరిగా చూసుకోవడం లేదని, మరో చోట పని ఇప్పించాలని ఆమె కోరింది. అందుకు సరేనన్న ఆ ఏజెంట్.. మరో చోట పని దొరికేలోపు తన ఆఫీసులోనే ఉండమని చెప్పాడు. అంతే, ఆమెని ఓ గదిలో బంధించి, వేధించడం మొదలుపెట్టాడు. మానసికంగానే కాదు.. లైంగికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. సమయానికి ఆహారం కూడా ఇవ్వడం లేదు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
దీంతో.. శ్రావణి సెల్ఫీ వీడియోలో తన వ్యధ చెప్పుకుంది. తనని వెంటనే భారత్కు రప్పించండని ఆ వీడియోలో కోరింది. ఏజెంట్ చెంగల్రాజా తనని పెడుతున్న చిత్రహింసల గురించి ఆ వీడియోలో వివరించింది. ఏజెంట్తో పాటు అతని పార్ట్నర్ కూడా తనని వేధిస్తున్నాడని భోరుమంది. నాలుగు రోజుల నుంచి సరిగ్గా ఆహారం తినలేదని, కేవలం నీళ్ళతోనే సాగిస్తున్నానని ఆమె విలపించింది. ఎలాగైనా భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వేడుకుంది. ఇక్కడున్న శ్రావణి అత్త సైతం, ఏజెంట్ బాగా చూసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన కోడల్ని రప్పించాలని కోరింది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!