Wrestlers protest: “చంపాలనుకుంటే చంపేయండి”.. బీజేపీని తరిమికొట్టే సమయం వచ్చిందన్న కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం రాత్రి రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళ రెజ్లర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ‘‘మేము పథకాలు సాధించింది ఈ రోజు చూడడానికేనా..’’ అంటూ స్టార రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము నేరస్తుల కాదని, మీరు మమ్మల్ని చంపాలనుకుంటే చంపండి అని వినేష్ ఫోగట్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ప్రత మగాడికి ఆడవాళ్లను తిట్టే హక్కుందా..? ఈ పోలీసులు తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపగలరని వినేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మహిళా పోలీస్ అధికారులు ఎక్కడ ఉన్నారు.? అని ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న పోలీసులు తన సోదరుడిని కొట్టారని ఆమె ఆరోపించారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Alwal News: అల్వాల్లో సాప్ట్వేర్ ఉద్యోగిని హల్ చల్.. కొత్తకారుతో భీభత్సం
ఇదిలా ఉంటే ఫోగట్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘దేశంలోని ఛాంపియన్ ప్లేయర్లతో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం విచారకరం, సిగ్గుచేటు. బీజేపీ వ్యక్తులు మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారు.. మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీ తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇదిలా ఉంటే రెజ్లర్లకు మద్దతుగా గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్దకు మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ వెళ్లారు. తనను నిరసన ప్రదేశానికి అనుమతించడం లేదని ఆమె ఆరోపించారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెబుతున్నారని, ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషన్ కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని..? స్వాతి మలివాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!