Threatening Letter: మసీదు నుండి శబ్దం వస్తే.. మృతదేహాలను లెక్కించడానికి సిద్ధంగా ఉండండి
- ఉత్తరప్రదేశ్ లోని మోడీనగర్ మసీదులో లేఖ కలకలం..
- మసీదుపై ఉన్న లౌడ్ స్పీకర్లు తీయకుంటే మృతదేహాలను లెక్కిస్తానంటూ వెల్లడి..
- మసీదు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Threatening Letter: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న మసీదుకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. మసీద్ యొక్క లౌడ్ స్పీకర్ తీయకుంటే అందులో ఉన్న మృతదేహాలను లెక్కిస్తానని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయమై మురాద్నగర్ పోలీస్ స్టేషన్లో మసీదు నిర్వహకులు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న తర్వాత మసీదు చుట్టూ పోలీసు బలగాలను మోహరించి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
Also Read
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
అయితే, సునేహ్రీ మసీదు మోడీనగర్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉంది. ఇవాళ (శనివారం) ఉదయం ఫజర్ ప్రార్థనలు చేసేందుకు ప్రజలు మసీదుకు వెళ్లారు. ఇంతలో మసీదు ఆవరణలో బెదిరింపు లేఖ పడి ఉంది. మసీదులో లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే మృతదేహాలను లెక్కించేందుకు సిద్ధంగా ఉండాలని లేఖలో రాసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే న్యాయవాది వసీం మురాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పీఎస్ ఇన్ చార్జి ముఖేష్ కుమార్ భారీ పోలీసు బలగాలతో మసీదుకు చేరుకున్నారు. కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు ఏసీపీ నరేష్ కుమార్ తెలిపారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
Read Also: Komatireddy: అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం ప్రయత్నాలు..
కాగా, ముస్లింలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి.. మసీదులోని లౌడ్ స్పీకర్ల నుంచి శబ్దం వస్తే, మృతదేహాలను లెక్కించడానికి సిద్ధంగా ఉండండి.. అలాగే, మురాద్నగర్లోని అన్ని మసీదుల స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాలి.. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది అని లేఖ రాసిన వ్యక్తి తన పేరును సనాతని అని రాసుకొచ్చాడు. ఇక, ఆ లేఖను స్వాధీనం చేసుకన్న పోలీసులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!