Chhattisgarh: బస్తర్ గ్రామాల్లో స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఎగిరిన భారత జెండా..
- మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తొలిసారిగా ఎగిరిన భారత జెండా..
- ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పలు గ్రామాల్లో గణతంత్ర వేడుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియా, నక్సలిజానికి కంచుకోట. ఇప్పటికీ దేశంలో మావోయిస్టులు చాలా యాక్టివ్గా ఉన్న ప్రాంతం. నిత్యం ఎన్కౌంటర్లలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ పోరులో అనేక గిరిజన పల్లెలు గత కొన్ని దశాబ్ధాలుగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అక్కడి గిరిజన గూడేల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానపు చూపులే. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా కూడా, ఛత్తీస్గఢ్ అటవీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ పట్టు పూర్తిగా లేదని చెప్పొచ్చు.
Also Read
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రభుత్వం దృఢంగా వ్యవహరించి, మావోయిస్టులను నిర్మూలించే చివరి దశకు చేరుకున్నారు. భద్రతా బలగాల సాయంతో బస్తర్ గ్రామాలు ఇప్పుడు నక్సల్స్ భయాన్ని అధిగమించారు. బీజాపూర్, సుకుమా వంటి జిల్లాల్లో గిరిజన గ్రామాలు స్వేచ్ఛని అనుభవిస్తున్నాయి. సుక్మా జిల్లాలోని మండలాల్లో 16 పోలీస్ శిభిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేశారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తముల్పాడ్ ఒకటి. ఈ గ్రామంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ ఈ వేడుకలు నాయకత్వం వహించింది. పిల్లలు, వృద్ధులతో సహా గ్రామస్తులు ‘‘భారత్ మాతా కీ జై’’ వంటి నినాదాలు చేస్తూ, స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. నక్సల్స్ భయం వల్ల తుముల్పాడ్ వంటి గ్రామాల్లోని ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండా ఉన్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో కొత్త పోలీస్ శిబిరాల ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు ప్రభుత్వంతో మేమేకం అవుతున్నారు. సుక్మాలోని చింతల్నార్, పూవర్తి వంటి అంత్యం ప్రభావిత మండలాల్లో 16కి పైగా పోలీస్ శిబిరాలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలు వీరి ఆధ్వర్యంలో జరిగాయి.
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!