Brij Bhushan Singh: “గంగలో పారేస్తామని వెళ్లి టికాయక్కు ఇచ్చారు”.. రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ శరణ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brij Bhushan Singh: రెజ్లర్లు గంగలో తమ మెడల్స్ పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై భారత రెజర్ల సమాఖ్య(WFI) చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల్ని కొట్టిపారేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ శరణ్ ను పదవి నుంచి తీసేసి, అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తమ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని మంగళవారం రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు. ఆ సమయంలో రైతు సంఘాల నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. బ్రిజ్ శరణ్ అరెస్ట్ పై ప్రభుత్వానికి 5 రోజుల అల్టిమేటం విధించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్లో తీవ్రమైన ఆహార సంక్షోభం.. యూఎన్ నివేదిక..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
దీనిపై బ్రిజ్ శరణ్ స్పందించారు. రెజ్లర్లు వారి పతకాలను గంగలో ముంచితే మనం ఏం చేయగలం..? అని అన్నారు. రెజ్లర్లు తమ మెడల్స్ ని గంగా నదిలో పారేయడానికి వెళ్లారు..కానీ గంగలో విసిరేయకుండా.. వాటిని రాకేష్ టికాయత్ కు ఇచ్చారు. అది వారి నిర్ణయం.. మనం ఏం చేయగలం..? అని అన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అని ఆయన అన్నారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని.. వారు మాత్రమే దీనికి సమాధానం చెప్పాలని, వారి అభ్యర్థన మేరకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని అన్నారు. ‘‘తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. నా పదవి కాలం ముగిసింది, ఎన్నికలు జరుగుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమస్య లేదు అని పునరుద్ఘాటించారు.
మంగళవారం రోజున హరిద్వార్ వెళ్లిన రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ గంగా నదిలో పతకాలను పారేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమయంలో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రైతు సంఘాల నేతలు వారించడంతో వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆరు సార్లు ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!