Bihar: పెళ్లికి వెళ్లి మద్యం తాగారు.. 40 మందికి పైగా అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..
- పెళ్లికి హాజరైన 40 మంది అరెస్ట్..
- మద్యపాన నిషేధాన్ని మరిచి మందు తాగిన వైనం..
- గిఫ్టులుగా మందు బాటిళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ ముజఫర్పూర్లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హాజరైన వారు ఇతరులకు గిప్టు ఇవ్వడానికి మద్యం బాటిళ్లని కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనలో రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kash Patel: ఎఫ్బీఐ చీఫ్గా కాష్ పటేల్.. ప్రో-ఇండియా లీడర్లతో నింపేస్తున్న ట్రంప్..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
40 మందితో పాటు ఏడుగురు మద్యం వ్యాపారులు, వివాహానికి హాజరైన వారు మద్యం కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేశారు. మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ మనుషులుగా వచ్చిన ఎక్సైజ్ పోలీసులు పెళ్లిలో మద్యంతో సంబంధం ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మద్యం స్మగ్లర్లు మరియు తాగుబోతులపై ఎక్సైజ్ శాఖ నిరంతరం ప్రచారం నిర్వహిస్తోందని, మా బృందం సభ్యులు వారిపై నిఘా ఉంచారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శివేంద్ర ఝా తెలిపారు.
బీహార్ మధ్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన అనేక సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం బయటపడ్డాయి. మద్యపాన నిషేధం వల్ల కొన్ని సందర్భాల్లో కల్తీ మద్యానికి అలవాటు పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఉన్నాయి. గత నెలలో పాట్నా హైకోర్టులో సంపూర్ణ మద్యపాన నిషేధంపై బీహార్ ప్రభుత్వ అధికారుల్ని నిందించింది. నిషేధాన్ని పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులే కాదు, రాష్ట్ర పన్ను శాఖ, రవాణా శాఖ అధికారులే ఇష్టపడుతున్నారని, ఇది వారికి పెద్ద ఎత్తున డబ్బు తీసుకువస్తోందని, నిజానికి అనధికారిక మద్యం, ఇతర నిషేధిత వ్యాపారాలకు దారి తీసిందని జస్టిస్ పూర్ణేందు సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!