Bihar: పెళ్లికి వెళ్లి మద్యం తాగారు.. 40 మందికి పైగా అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..
- పెళ్లికి హాజరైన 40 మంది అరెస్ట్..
- మద్యపాన నిషేధాన్ని మరిచి మందు తాగిన వైనం..
- గిఫ్టులుగా మందు బాటిళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ ముజఫర్పూర్లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హాజరైన వారు ఇతరులకు గిప్టు ఇవ్వడానికి మద్యం బాటిళ్లని కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనలో రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kash Patel: ఎఫ్బీఐ చీఫ్గా కాష్ పటేల్.. ప్రో-ఇండియా లీడర్లతో నింపేస్తున్న ట్రంప్..
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
40 మందితో పాటు ఏడుగురు మద్యం వ్యాపారులు, వివాహానికి హాజరైన వారు మద్యం కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేశారు. మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ మనుషులుగా వచ్చిన ఎక్సైజ్ పోలీసులు పెళ్లిలో మద్యంతో సంబంధం ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మద్యం స్మగ్లర్లు మరియు తాగుబోతులపై ఎక్సైజ్ శాఖ నిరంతరం ప్రచారం నిర్వహిస్తోందని, మా బృందం సభ్యులు వారిపై నిఘా ఉంచారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శివేంద్ర ఝా తెలిపారు.
బీహార్ మధ్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన అనేక సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం బయటపడ్డాయి. మద్యపాన నిషేధం వల్ల కొన్ని సందర్భాల్లో కల్తీ మద్యానికి అలవాటు పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఉన్నాయి. గత నెలలో పాట్నా హైకోర్టులో సంపూర్ణ మద్యపాన నిషేధంపై బీహార్ ప్రభుత్వ అధికారుల్ని నిందించింది. నిషేధాన్ని పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులే కాదు, రాష్ట్ర పన్ను శాఖ, రవాణా శాఖ అధికారులే ఇష్టపడుతున్నారని, ఇది వారికి పెద్ద ఎత్తున డబ్బు తీసుకువస్తోందని, నిజానికి అనధికారిక మద్యం, ఇతర నిషేధిత వ్యాపారాలకు దారి తీసిందని జస్టిస్ పూర్ణేందు సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!