PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శన ధాటిని పెంచుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ గోవా అభ్యర్థి వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ.. వారు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై భారత రాజ్యాంగం బలవంతంగా ప్రయోగించబడిందని, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తాను చెప్పాను’’ అని కాంగ్రెస్ సౌత్ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెస్ సోమవారం ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.
Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Also Read
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
మంగళవారం ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగ వర్తించదని చెబుతున్నారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా తీసుకువచ్చారని అతను స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ ‘షహజాదా(యువరాజు)తో చెప్పారు’’ అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఇటీవల ప్రధాని మోడీ యువరాజు అని, కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా అభివర్ణిస్తున్నారు.
‘‘ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా..? ఇది రాజ్యంగంతో జోక్యం చేసుకోవడం కాదా..? ఇదంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలో భాగమే. నేను గోవాలో రాజ్యాంగాన్ని నిరాకరిస్తున్నారు. భారతదేశం అంతటా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మోడీ.. బీజేపీ పక్కన పెట్టండి, బాబా సాహెబ్ అంబేద్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ఇటీవల అన్నారు.
తాజావార్తలు
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!