PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శన ధాటిని పెంచుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ గోవా అభ్యర్థి వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ.. వారు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై భారత రాజ్యాంగం బలవంతంగా ప్రయోగించబడిందని, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తాను చెప్పాను’’ అని కాంగ్రెస్ సౌత్ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెస్ సోమవారం ఓ బహిరంగ సభలో ప్రసంగించారు.
Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
మంగళవారం ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగ వర్తించదని చెబుతున్నారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా తీసుకువచ్చారని అతను స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ ‘షహజాదా(యువరాజు)తో చెప్పారు’’ అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఇటీవల ప్రధాని మోడీ యువరాజు అని, కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా అభివర్ణిస్తున్నారు.
‘‘ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా..? ఇది రాజ్యంగంతో జోక్యం చేసుకోవడం కాదా..? ఇదంతా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలో భాగమే. నేను గోవాలో రాజ్యాంగాన్ని నిరాకరిస్తున్నారు. భారతదేశం అంతటా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన మోడీ.. బీజేపీ పక్కన పెట్టండి, బాబా సాహెబ్ అంబేద్కర్ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ఇటీవల అన్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!