Jaishankar: నెహ్రూ భారత్ని కాదని చైనాకు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించారు.. పటేల్ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అహ్మదాబాద్లోని గుజరాత్ ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూని ఎలా హెచ్చరించారనే విషయాలను పంచుకున్నారు.
Read Also: Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్ రోడ్ షోలో అన్నామలై..
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
నెహ్రూ ఇండియా కంటే ముందు చైనాకు యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యదేశంగా స్థానం కల్పించాలని అనుకున్నారని జైశంకర్ అన్నారు. 1950లో సర్దార్ పటేల్, నెహ్రూ మధ్య సమావేశం జరిగింది. దీంట్లో పటేల్ చైనా ముప్పు గురించి నెహ్రూని హెచ్చరించారు. ఈ రోజు మనం రెండు వైపు(పాకిస్తాన్, చైనా) నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని పటేల్ చెప్పారు. చైనీయులు ఏది మాట్లాడినా, వారి ఉద్దేశం మంచిది కాదని తాను భావిస్తు్న్నానని అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని, దీనిపై ఒక విధానాన్ని రూపొందించాలని పటేల్ హెచ్చరించారు. అయితే నెహ్రూ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు’’ అని జైశంకర్ అన్నారు.
‘‘ చైనీయులను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారని నెహ్రూ, పటేల్తో అన్నారు. హిమాలయాల మీదుగా మనపై దాడి చేయడం అసాధ్యం. యూఎన్లో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చర్చ జరిగింది. అయితే, ఈ స్థానాన్ని ముందుగా చైనాకు ఇవ్వాలని అని నెహ్రూ చెప్పారు. కాబట్టి ఈ రోజు మనం మొదట భారత్ గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు చైనా గురించి మాట్లాడిన సందర్భం అది’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లవద్దని సర్దార్ పటేల్ వైఖరిని కూడా నెహ్రూ పట్టించుకోలేదని, గత దశాబ్ధ కాలంగా కేంద్రంలో బీజేపీ వారసత్వంగా వచ్చిన సమస్యలతో వ్యహరిస్తోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?