Governors: ముగియనున్న 4 రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం.. తర్వాత రేసులో వీళ్లే..!
- నాలుగు రాష్ట్రాల్లో ముగియనున్న గవర్నర్ పదవీకాలం
- ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్.. రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా
- గుజరాత్లో ఆచార్య దేవవ్రత్.. కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా, గుజరాత్లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి రాజీనామాను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు.
కాగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీ సీనియర్ నేతలను పోటీకి దింపలేదు. ఈ పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఈ నేతలను గవర్నర్గా చేయగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్లో అశ్వినీ చౌబే, ఉత్తరప్రదేశ్లో వీకే సింగ్, ఢిల్లీలో డాక్టర్ హర్షవర్ధన్.. ఇలా చాలా మంది సీనియర్ నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు. ఈ నేతలంతా గవర్నర్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్), డాక్టర్ హర్షవర్ధన్, అశ్విని చౌబే గత లోక్సభలో బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. అంతేకాకుండా.. ఈ ముగ్గురు కేంద్ర మంత్రివర్గంలో పని చేశారు.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..
వీకే సింగ్ ఘజియాబాద్, హర్షవర్ధన్ చాందినీ చౌక్, అశ్విని చౌబే బక్సర్ నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. వీకే సింగ్ మోడీ ప్రభుత్వంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. హర్షవర్ధన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పని చేశారు. అశ్విని చౌబే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
మరోవైపు.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలాన్ని పొడిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎల్డిఎఫ్ ప్రభుత్వ రాజకీయ పక్షపాత చర్యలను, నిర్ణయాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో కేరళ గవర్నర్ గట్టిగా ఎదుర్కొన్నారని కేంద్రం భావిస్తోంది. గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలం సెప్టెంబర్ 6తో ముగియనుంది. నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు గవర్నర్లను మార్చవచ్చు. తదుపరి గవర్నర్లను నియమించే వరకు గవర్నర్ తన పదవీకాలాన్ని కొనసాగించనున్నారు.
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!