Governors: ముగియనున్న 4 రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం.. తర్వాత రేసులో వీళ్లే..!
- నాలుగు రాష్ట్రాల్లో ముగియనున్న గవర్నర్ పదవీకాలం
- ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్.. రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా
- గుజరాత్లో ఆచార్య దేవవ్రత్.. కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా, గుజరాత్లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి రాజీనామాను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు.
కాగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీ సీనియర్ నేతలను పోటీకి దింపలేదు. ఈ పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఈ నేతలను గవర్నర్గా చేయగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్లో అశ్వినీ చౌబే, ఉత్తరప్రదేశ్లో వీకే సింగ్, ఢిల్లీలో డాక్టర్ హర్షవర్ధన్.. ఇలా చాలా మంది సీనియర్ నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు. ఈ నేతలంతా గవర్నర్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్), డాక్టర్ హర్షవర్ధన్, అశ్విని చౌబే గత లోక్సభలో బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. అంతేకాకుండా.. ఈ ముగ్గురు కేంద్ర మంత్రివర్గంలో పని చేశారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..
వీకే సింగ్ ఘజియాబాద్, హర్షవర్ధన్ చాందినీ చౌక్, అశ్విని చౌబే బక్సర్ నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. వీకే సింగ్ మోడీ ప్రభుత్వంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. హర్షవర్ధన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పని చేశారు. అశ్విని చౌబే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
మరోవైపు.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలాన్ని పొడిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎల్డిఎఫ్ ప్రభుత్వ రాజకీయ పక్షపాత చర్యలను, నిర్ణయాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో కేరళ గవర్నర్ గట్టిగా ఎదుర్కొన్నారని కేంద్రం భావిస్తోంది. గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలం సెప్టెంబర్ 6తో ముగియనుంది. నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు గవర్నర్లను మార్చవచ్చు. తదుపరి గవర్నర్లను నియమించే వరకు గవర్నర్ తన పదవీకాలాన్ని కొనసాగించనున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!