Governors: ముగియనున్న 4 రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం.. తర్వాత రేసులో వీళ్లే..!
- నాలుగు రాష్ట్రాల్లో ముగియనున్న గవర్నర్ పదవీకాలం
- ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్.. రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా
- గుజరాత్లో ఆచార్య దేవవ్రత్.. కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్లో కల్రాజ్ మిశ్రా, గుజరాత్లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి రాజీనామాను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు.
కాగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీ సీనియర్ నేతలను పోటీకి దింపలేదు. ఈ పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఈ నేతలను గవర్నర్గా చేయగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్లో అశ్వినీ చౌబే, ఉత్తరప్రదేశ్లో వీకే సింగ్, ఢిల్లీలో డాక్టర్ హర్షవర్ధన్.. ఇలా చాలా మంది సీనియర్ నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు. ఈ నేతలంతా గవర్నర్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్), డాక్టర్ హర్షవర్ధన్, అశ్విని చౌబే గత లోక్సభలో బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. అంతేకాకుండా.. ఈ ముగ్గురు కేంద్ర మంత్రివర్గంలో పని చేశారు.
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..
వీకే సింగ్ ఘజియాబాద్, హర్షవర్ధన్ చాందినీ చౌక్, అశ్విని చౌబే బక్సర్ నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. వీకే సింగ్ మోడీ ప్రభుత్వంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. హర్షవర్ధన్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిగా పని చేశారు. అశ్విని చౌబే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
మరోవైపు.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలాన్ని పొడిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎల్డిఎఫ్ ప్రభుత్వ రాజకీయ పక్షపాత చర్యలను, నిర్ణయాలను ప్రజల ముందు బట్టబయలు చేయడంలో కేరళ గవర్నర్ గట్టిగా ఎదుర్కొన్నారని కేంద్రం భావిస్తోంది. గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలం సెప్టెంబర్ 6తో ముగియనుంది. నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు గవర్నర్లను మార్చవచ్చు. తదుపరి గవర్నర్లను నియమించే వరకు గవర్నర్ తన పదవీకాలాన్ని కొనసాగించనున్నారు.
తాజావార్తలు
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!