Utter Pradesh: తన పెద్దకర్మ తానే చేసుకున్న వృద్ధుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Utter Pradesh: మనిషి చనిపోయిన తరువాత 10 రోజులకు లేదా 11 రోజులకు పెద్దకర్మ నిర్వహిస్తారు. అది కూడా మరణించిన వారి కుమారులు నిర్వహిస్తారు. చనిపోయిన వ్యక్తికి కుమారులు లేకపోతే కుమార్తెలు చేస్తారు.. వారు కూడా ఏకపోతే.. వారి అన్నతమ్ములు చేస్తారు. కానీ తను చనిపోయిన తరువాత తన పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో లేదో అన్న సందేహంతో ఒక వృద్దుడు తనకు తానుగా పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు.300 మందికి సరిపడా ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేశాడు. అదేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం.. ఈ ఘటన ఉత్తర్ ప్రేదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.
Read also: Ashu Reddy : స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అషు రెడ్డి..
Also Read
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
ఉత్తర్ ప్రేదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన 59 ఏళ్ల జఠాశంకర్ తాను బ్రతికుండగానే తన పెద్దకర్మన నిర్వహించుకున్నాడు. అంతేకాదు మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా తన సమాధిని కూడా నిర్మింప చేసుకున్నాడట. తాను చనిపోయి తరువాత తనను అదే సమాధిలో పాతిపెట్టమని తన కుటుంబ సభ్యులను కోరాడు. కొద్ది వారాల క్రితం తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాడట. ఈ కార్యక్రమం అనంతరం తన పెద్దకర్మకు రావల్సింది గ్రామస్తులందరినీ ఆహ్వానించాడు. గురువారం రాత్రి తన పెద్దకర్మను పూర్తి చేశాడట. ఈ కార్యక్రమానికి జఠా శంకర్ బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు అతను ఆహ్వానించిన గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా హాజరైనట్టు తెలిసింది. అతడు సుమారు 300 మందికి విందున ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Read also: Monsoon: ఏపీకి చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇక వర్షాలే..
59 ఏళ్ల జఠాశంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతడికి ఏడుగురు సంతానం ఉన్నారు. అయితే తాను చనిపోయిన తరువాత తన పెద్దకర్మ కార్యక్రమాన్ని తన పిల్లలు, కుటుంబ సభ్యులు జరిపిస్తారో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. అందుకోసం వారిపై ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదని చెప్పాడు. అందుకే తాను బతికి ఉన్నపుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు శంకర్ తెలిపాడు. ఇందుకు తన పిల్లలు, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. మరణానికి ముందు ఈ కార్యక్రమం చేయడం మన ఆచారాల్లో భాగం కాదు.. కానీ నేను నిర్వహించుకున్నాను.. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని జఠా శంకర్ చెప్పాడు.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!