Chhava: ‘‘ఛావా’’ సినిమాని నిషేధించాలి.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..
- ఛావా సినిమాను బ్యాన్ చేయాలి..
- అమిత్ షాకి ముస్లిం జమాత్ అధ్యక్షుడి లేఖ..
- హిందూ యువతను రెచ్చగొడుతుందని ఆరోపణ..
- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో లేఖకు ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు.
ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడైన రజ్వీ.. ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర చిత్రీకరణ హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉందని, నాగ్పూర్లో చెలరేగిన మత హింస వంటి అశాంతిని కలిగించే విధంగా చిత్రీకరణ ఉందని పేర్కొన్నాడు. ఛావా సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించిందని, ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారని, అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
Read Also: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
‘‘భారతదేశ ముస్లింలు చక్రవర్తి ఔరంగజేబును తమ ఆదర్శంగా మరియు నాయకుడిగా పరిగణించరు. మేము అతన్ని కేవలం ఒక పాలకుడిగా మాత్రమే పరిగణిస్తాము, అంతకు మించి ఏమీ లేదు’’ అని రజ్వీ అన్నారు. నాగ్పూర్లో శాంతి కోసం విజ్ఞప్తి చేశానని, ఉద్రిక్తతలు పెరగడంతో వారిని శాంతింపజేయడానికి ఈ ప్రాంతంలోని మసీదుల ఉలామాలు, ఇమామ్లతో సంప్రదింపులు జరుపుతున్నానని కూడా చెప్పాడు.
ఇటీవల విడుదలైన ‘‘ఛావా’’ సినిమా మారాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ఈ సినిమాలో చూపించారు. మరాఠాలు, హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు. అప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు హిందువుల్లో భావోద్వేగం పెరిగింది. ఆ తర్వాత మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధి ఉండకూడదనే నిరసనలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!