Chhava: ‘‘ఛావా’’ సినిమాని నిషేధించాలి.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..
- ఛావా సినిమాను బ్యాన్ చేయాలి..
- అమిత్ షాకి ముస్లిం జమాత్ అధ్యక్షుడి లేఖ..
- హిందూ యువతను రెచ్చగొడుతుందని ఆరోపణ..
- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో లేఖకు ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు.
ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడైన రజ్వీ.. ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర చిత్రీకరణ హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉందని, నాగ్పూర్లో చెలరేగిన మత హింస వంటి అశాంతిని కలిగించే విధంగా చిత్రీకరణ ఉందని పేర్కొన్నాడు. ఛావా సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించిందని, ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారని, అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
Read Also: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
‘‘భారతదేశ ముస్లింలు చక్రవర్తి ఔరంగజేబును తమ ఆదర్శంగా మరియు నాయకుడిగా పరిగణించరు. మేము అతన్ని కేవలం ఒక పాలకుడిగా మాత్రమే పరిగణిస్తాము, అంతకు మించి ఏమీ లేదు’’ అని రజ్వీ అన్నారు. నాగ్పూర్లో శాంతి కోసం విజ్ఞప్తి చేశానని, ఉద్రిక్తతలు పెరగడంతో వారిని శాంతింపజేయడానికి ఈ ప్రాంతంలోని మసీదుల ఉలామాలు, ఇమామ్లతో సంప్రదింపులు జరుపుతున్నానని కూడా చెప్పాడు.
ఇటీవల విడుదలైన ‘‘ఛావా’’ సినిమా మారాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ఈ సినిమాలో చూపించారు. మరాఠాలు, హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు. అప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు హిందువుల్లో భావోద్వేగం పెరిగింది. ఆ తర్వాత మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధి ఉండకూడదనే నిరసనలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?