Chhava: ‘‘ఛావా’’ సినిమాని నిషేధించాలి.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..
- ఛావా సినిమాను బ్యాన్ చేయాలి..
- అమిత్ షాకి ముస్లిం జమాత్ అధ్యక్షుడి లేఖ..
- హిందూ యువతను రెచ్చగొడుతుందని ఆరోపణ..
- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో లేఖకు ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు.
ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడైన రజ్వీ.. ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర చిత్రీకరణ హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉందని, నాగ్పూర్లో చెలరేగిన మత హింస వంటి అశాంతిని కలిగించే విధంగా చిత్రీకరణ ఉందని పేర్కొన్నాడు. ఛావా సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించిందని, ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారని, అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
Read Also: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
‘‘భారతదేశ ముస్లింలు చక్రవర్తి ఔరంగజేబును తమ ఆదర్శంగా మరియు నాయకుడిగా పరిగణించరు. మేము అతన్ని కేవలం ఒక పాలకుడిగా మాత్రమే పరిగణిస్తాము, అంతకు మించి ఏమీ లేదు’’ అని రజ్వీ అన్నారు. నాగ్పూర్లో శాంతి కోసం విజ్ఞప్తి చేశానని, ఉద్రిక్తతలు పెరగడంతో వారిని శాంతింపజేయడానికి ఈ ప్రాంతంలోని మసీదుల ఉలామాలు, ఇమామ్లతో సంప్రదింపులు జరుపుతున్నానని కూడా చెప్పాడు.
ఇటీవల విడుదలైన ‘‘ఛావా’’ సినిమా మారాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ఈ సినిమాలో చూపించారు. మరాఠాలు, హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు. అప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు హిందువుల్లో భావోద్వేగం పెరిగింది. ఆ తర్వాత మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధి ఉండకూడదనే నిరసనలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!