ఢిల్లీ కాలుష్యం పై సుప్రీం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము మీకు 24 గంటలు ఇస్తున్నాము. మీరు దీనిని తీవ్రంగా పరిశీలించి, సీరియస్గా పరిష్కారం చూపాలని కోరుతున్నామని అని జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వికాస్సింగ్ వాదనలు వినిపిస్తూ, గాలి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో టాస్క్ఫోర్స్ తనిఖీ చేయాలని అన్నారు. సెంట్రల్ విస్టాతో సహా నిర్మాణ స్థలాలను కూడా సందర్శించాలి. కాలుష్య నిబంధనలను ఉల్లంఘించే ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలను సీల్ చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లకు అధికారం కల్పించాల్సిన అవసరం ఉందని సింగ్ అన్నారు. నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
దీనిపై సీజేఐ మాట్లాడుతూ.. చర్యలు తీసుకుంటున్నామని మీరు చెప్పినప్పుడు మీ మాటలు నిజమేనన్నారు. పాఠశాలలు మూతపడ్డాయని మీరు చెప్పారు. కానీ పాఠశాలలు మూసివేయడం లేదు. చిన్న పిల్లలు ఇంకాస్కూళ్లకు వెళ్తున్నారు. ఢిల్లీలోని పాఠశాలలు మరియు ఇతర విద్యాసంస్థలు 15 రోజుల పాటు మూసివేయబడ్డాయి, అయితే అవి నవంబర్ 29న తిరిగి తెరుచుకున్నాయి.ఈ రోజు వార్తా పత్రికలు చూడండి పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. అమలును పర్యవేక్షించడానికి ఒకరిని నియమించారా అని కోర్టు ప్రశ్నించింది.
మీరు ఏమి చేసారు? యువకులు మరియు బాలికలు, ముసుగులు కూడా ధరించకుండా, పోస్టర్లతో రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు,” సీజేఐ పేర్కొన్నారు. పబ్లిసిటీ కాకుండా ఏం చేసావ్?” అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ, ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయని వాదించారు. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి మరియు కాలుష్య మూలాలపై అధ్యయనం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం IIT కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది” అని సింఘ్వీ చెప్పారు.
ప్రభుత్వ అఫిడవిట్ను సింఘ్వీ ప్రస్తావించారు.ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కోర్టుకు వివరించారు. ఇది కాలుష్యానికి మరొక కారణం, ప్రతిరోజూ చాలా అఫిడవిట్లు ధాఖలైతున్నాయని సుప్రీం బెంచ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ యువకుల్లో ఎంతమంది రోడ్డున పడ్డారో అఫిడవిట్లో వెల్లడించారా? పబ్లిసిటీ కోసమా?.. చేతిలో బ్యానర్తో ఓ యువకుడు రోడ్డు మధ్యలో నిల్చున్నాడు.. ఏంటి.. వాళ్ల ఆరోగ్యం గురించి ఎవరైనా జాగ్రత్త వహించాల్సిందేనని సుప్రీం బెంచ్ తెలిపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!