Ayodhya Terror Attack: అయోధ్యపై దాడికి ప్లాన్.. ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
- అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్
- ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది రెహ్మాన్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో రెహ్మాన్కు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెహ్మాన్.. మాంసం దుకాణంతో పాటు ఆటో నడిపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: VenkyAnil 3 : 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎన్ని సెంటర్స్ అంటే.?
Also Read
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
- India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
- CM Vijay Divorce Case: సీఎం విజయ్ - సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. రెహ్మాన్ను 10 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కొంతకాలంగా అయోధ్యపై దాడికి కుట్ర పన్నినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్.. ఇస్లామిక్ సమావేశాల్లో కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. 2024, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. ఆ సమయంలో రెహ్మాన్ అనేక రౌండ్లు వేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నిఘా కూడా ఉంచినట్లు కనిపెట్టారు. ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: AP Legislative Council: ఆ పాపం జగన్ రెడ్డిదే.. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచబోదు: మంత్రి గొట్టిపాటి
రెండు హ్యాండ్ గ్రెనేడ్లను రైల్లో అయోధ్యకు తీసుకెళ్లాలని రెహ్మాన్ ప్లాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హర్యానా ఎస్టీఎఫ్, గుజరాత్లోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న పాలి గ్రామం సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లో రెహ్మాన్ దాచిపెట్టాడు. రెండింటినీ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. నిందితుడిని ఏటీఎస్ బృందం గుజరాత్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే ఈ కుట్రలో మరింత మంది పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: SLBC: రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
తాజావార్తలు
-
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ స్టోరీ లైన్ లీక్!
-
Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే సమంత ఏడ్చేసింది!
-
Samantha : సమంత ‘మా ఇంటి బంగారం’కు పోటీగా దిగుతోన్న నాలుగైదు సినిమాలు
-
OnePlus N6: వన్ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!