Telangana Vimochana Dinotsavam: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులతో కిషన్ రెడ్డి ఈ మేరకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు అమృతోత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్ణయం తీసుకుంది. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం వియోచన కార్యక్రమాలను జరుపనుంది.
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర రాజకీయం.. ఎన్టీఆర్ తో బీజేపీ భేటీనే కారణం..?
ఈ కార్యక్రమాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలు కూడా హాజరవ్వనున్నారు. గతంలో నిజాం స్టేట్ లో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో వియోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా చేయడం లేదని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటుంది. రేపు జరిగే కేబినెట్, ఎల్పీ సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!