Brahmastra: బ్రహ్మాస్త్ర రాజకీయం.. ఎన్టీఆర్ తో బీజేపీ భేటీనే కారణం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra: ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం సినీ, రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర రాజకీయంపై చర్చ నడుస్తోంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ గెస్టుగా రానున్న సంగతి కూడా తెల్సిందే. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఈవెంట్ స్టార్ట్ అయ్యిపోయి ఉండేది. కానీ, బ్రహ్మాస్త్ర టీమ్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వినాయక మండపాల బందోబస్తు కారణంగా సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఇక్కడే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
మొదటి నుంచి అన్నీ సెట్ చేసుకొని పర్మిషన్లు తీసుకొని ఇక్కడికి వరకు వచ్చాకా పర్మిషన్ ఇవ్వలేము, ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని ఎలా చెప్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్టుగా రాబోతున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షాను మీట్ అయ్యాడు. ఇక మరోపక్క ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీనే. ఈ రెండు కారణాల వలనే కొంతమంది రాజకీయ నాయకులు బ్రహ్మాస్త్ర ను అడ్డుకొంటున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్- షా మధ్య ఏం జరిగిందో అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం. కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారు అంటే మరి ఎన్టీఆర్ తరువాత జేపీ నడ్డా, నితిన్ ను కలవాల్సిన అవసరం ఏం ఉంది.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
సినీ ప్రముఖులతో బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందని అనుమానించిన పలువురు వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒకవేళ ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ కాకుండా మరెవ్వరు గెస్ట్ గా వచ్చినా ఈవెంట్ ను జరగనిచ్చి ఉండేవారా..? అనేది అంతుచిక్కని ప్రశ్న. ఏదిఏమైనా ఎన్టీఆర్ రాజకీయ సెగ పాపం బాలీవుడ్ బ్రహ్మాస్త్రకు శాపంగా మారిందని అంటున్నారు. హైదరాబాద్ లో ప్రేక్షకుల అభిమానాన్ని చూడడానికి వచ్చిన బాలీవుడ్ బృందానికి తెలుగు రాష్ట్రాల రాజకీయ సెగ చూపించారు అని మరికొందరు అంటున్నారు. మరి ఈ ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు పెడతారో చూడాలి.
- Tags
- amith sha
- bjp
- brahmastra
- ntr
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!