Tejashwi Yadav: ఎన్నికలప్పుడే మోడీకి బీహార్ గుర్తొస్తుంది
- ఎన్నికలప్పుడే మోడీకి బీహార్ గుర్తొస్తుంది
- బీహార్ పర్యటనపై తేజస్వి యాదవ్ విమర్శలు
ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సోమవారం బీహార్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్.. మోడీ టూర్ను ఉద్దేశించి 15 ప్రశ్నలు సంధించారు.
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: మొత్తానికి భర్తతో విడిపోవడం పై నోరు విప్పిన మంచు లక్ష్మి !
Also Read
బీహార్ ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా.. రాష్ట్రం బాగుపడలేదన్నారు. కేంద్రంలో మోడీ 11 సంవత్సరాలు, నితీష్ కుమార్ 20 సంవత్సరాలు పాలించినా బీహార్ బాగుపడలేదన్నారు. ఇంకా బీహార్ అట్టడుగునే ఉందన్నారు. తలసరి ఆదాయం, పెట్టుబడిలో బీహార్ అత్యల్ప స్థానంలో ఉందని చెప్పారు. ఆదాయంలో బీహార్లో అత్యల్ప స్థానంలో ఉంటే.. నిరుద్యోగం, వలసలు, పేదరికంలో బీహార్ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Harish Rao: టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!
‘ప్రత్యేక హోదా’తోనే బీహార్ బాగు పడుతుందని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. 2017లో మోతీహారీ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తానని, దాని చక్కెరతో టీ తాగుతానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు… ఈ టీ ఎప్పుడు తాగుతారో ఆయన మాకు చెబుతారా? కతిహార్లో జనపనార మిల్లును ఎప్పుడు ప్రారంభిస్తారు?,’’ అని అడిగారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
బీహార్ 2025 ఎన్నికలు అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. 2020 ఎన్నికల్లో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రాష్ట్రంలోని 234 సీట్లలో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 43, కాంగ్రెస్ కేవలం 19 స్థానాలు గెలుచుకుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో