Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
- అవును మా నూర్ఖాన్ ఎయిర్బేస్పై దాడి జరిగింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్..
- విషయాన్ని వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్..
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు. దీంతో పాకిస్తాన్ తొలిసారిగా అధికారంగా అంగీకరించినట్లైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాక్ సైన్యం హెడ్క్వార్టర్స్ ఉండే రావల్పిండిలోని ఎయిర్బేస్ను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఎయిర్బేస్ను భారత దాడులు తీవ్రంగా నష్టపరిచాయని, అక్కడ సిబ్బందిని గాయపరిచాయని ఆయన అంగీకరించాడు. భారత సైనిక చర్యల్ని ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాలను నెమ్మదిగా ఒప్పుకుంటోంది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో తనను బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన వీడియో వైరల్గా మారింది.
ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారతదేశం స్వల్ప వ్యవధిలో పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్లను పంపిందని అన్నారు. 36 గంటల్లో భారత్ దాదాపు 80 డ్రోన్లను ఉపయోగించిందని చెప్పారు. పాక్ దళాలు వాటిలో 79 డ్రోన్లను అడ్డగించారని, ఒక డ్రోన్ సైనిక స్థావరాన్ని ఢీకొట్టిందని ఆయన చెప్పారు. ఈ ఒక్క డ్రోన్ తమ సైనిక స్థావరానికి నష్టం కలిగించి, సిబ్బందిని గాయపరిచిందని అతను చెప్పాడు. పాక్ వైమానిక రక్షణ ప్రతిస్పంద చాలా విజయవంతమైందని చెప్పాడు. అయితే, భారత దాడులు పాకిస్తాన్ రక్షణలోకి చొచ్చుకుపోయాయనేది ఈ ప్రకటనతో తెలుస్తోంది.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం మే 9 రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించిందని దార్ అన్నారు. ఈ సమావేశంలో భారత్పై దాడికి కీలక నిర్ణయాలు ఆమోదించబడ్డాయని, మే 10వ తేదీ తెల్లవారుజామున నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేయడం ద్వారా భారత్ తప్పు చేసిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాక్లోని 11 ఎయిర్ బేసులపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ ఎయిర్ ఫోర్స్కు కీలకంగా ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత దాడితో మంటల్లో చిక్కుకుంది. మురిడ్, రఫికీ, సుక్కూర్, రహీంయార్ ఖాన్, సియాల్ కోట్, సర్గోదా, జకోబాబాద్, పస్రూర్, స్కర్దూ, చునియన్ ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో వందకు పైగా పాక్ సైనికులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!