Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
- అవును మా నూర్ఖాన్ ఎయిర్బేస్పై దాడి జరిగింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్..
- విషయాన్ని వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు. దీంతో పాకిస్తాన్ తొలిసారిగా అధికారంగా అంగీకరించినట్లైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాక్ సైన్యం హెడ్క్వార్టర్స్ ఉండే రావల్పిండిలోని ఎయిర్బేస్ను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఎయిర్బేస్ను భారత దాడులు తీవ్రంగా నష్టపరిచాయని, అక్కడ సిబ్బందిని గాయపరిచాయని ఆయన అంగీకరించాడు. భారత సైనిక చర్యల్ని ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాలను నెమ్మదిగా ఒప్పుకుంటోంది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో తనను బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన వీడియో వైరల్గా మారింది.
ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారతదేశం స్వల్ప వ్యవధిలో పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్లను పంపిందని అన్నారు. 36 గంటల్లో భారత్ దాదాపు 80 డ్రోన్లను ఉపయోగించిందని చెప్పారు. పాక్ దళాలు వాటిలో 79 డ్రోన్లను అడ్డగించారని, ఒక డ్రోన్ సైనిక స్థావరాన్ని ఢీకొట్టిందని ఆయన చెప్పారు. ఈ ఒక్క డ్రోన్ తమ సైనిక స్థావరానికి నష్టం కలిగించి, సిబ్బందిని గాయపరిచిందని అతను చెప్పాడు. పాక్ వైమానిక రక్షణ ప్రతిస్పంద చాలా విజయవంతమైందని చెప్పాడు. అయితే, భారత దాడులు పాకిస్తాన్ రక్షణలోకి చొచ్చుకుపోయాయనేది ఈ ప్రకటనతో తెలుస్తోంది.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం మే 9 రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించిందని దార్ అన్నారు. ఈ సమావేశంలో భారత్పై దాడికి కీలక నిర్ణయాలు ఆమోదించబడ్డాయని, మే 10వ తేదీ తెల్లవారుజామున నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేయడం ద్వారా భారత్ తప్పు చేసిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాక్లోని 11 ఎయిర్ బేసులపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ ఎయిర్ ఫోర్స్కు కీలకంగా ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత దాడితో మంటల్లో చిక్కుకుంది. మురిడ్, రఫికీ, సుక్కూర్, రహీంయార్ ఖాన్, సియాల్ కోట్, సర్గోదా, జకోబాబాద్, పస్రూర్, స్కర్దూ, చునియన్ ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో వందకు పైగా పాక్ సైనికులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..