Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
- అవును మా నూర్ఖాన్ ఎయిర్బేస్పై దాడి జరిగింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్..
- విషయాన్ని వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు. దీంతో పాకిస్తాన్ తొలిసారిగా అధికారంగా అంగీకరించినట్లైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాక్ సైన్యం హెడ్క్వార్టర్స్ ఉండే రావల్పిండిలోని ఎయిర్బేస్ను భారత్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఎయిర్బేస్ను భారత దాడులు తీవ్రంగా నష్టపరిచాయని, అక్కడ సిబ్బందిని గాయపరిచాయని ఆయన అంగీకరించాడు. భారత సైనిక చర్యల్ని ఇన్నాళ్లు తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాలను నెమ్మదిగా ఒప్పుకుంటోంది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో తనను బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన వీడియో వైరల్గా మారింది.
ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారతదేశం స్వల్ప వ్యవధిలో పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్లను పంపిందని అన్నారు. 36 గంటల్లో భారత్ దాదాపు 80 డ్రోన్లను ఉపయోగించిందని చెప్పారు. పాక్ దళాలు వాటిలో 79 డ్రోన్లను అడ్డగించారని, ఒక డ్రోన్ సైనిక స్థావరాన్ని ఢీకొట్టిందని ఆయన చెప్పారు. ఈ ఒక్క డ్రోన్ తమ సైనిక స్థావరానికి నష్టం కలిగించి, సిబ్బందిని గాయపరిచిందని అతను చెప్పాడు. పాక్ వైమానిక రక్షణ ప్రతిస్పంద చాలా విజయవంతమైందని చెప్పాడు. అయితే, భారత దాడులు పాకిస్తాన్ రక్షణలోకి చొచ్చుకుపోయాయనేది ఈ ప్రకటనతో తెలుస్తోంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ రాజకీయ, సైనిక నాయకత్వం మే 9 రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించిందని దార్ అన్నారు. ఈ సమావేశంలో భారత్పై దాడికి కీలక నిర్ణయాలు ఆమోదించబడ్డాయని, మే 10వ తేదీ తెల్లవారుజామున నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేయడం ద్వారా భారత్ తప్పు చేసిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాక్లోని 11 ఎయిర్ బేసులపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ ఎయిర్ ఫోర్స్కు కీలకంగా ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత దాడితో మంటల్లో చిక్కుకుంది. మురిడ్, రఫికీ, సుక్కూర్, రహీంయార్ ఖాన్, సియాల్ కోట్, సర్గోదా, జకోబాబాద్, పస్రూర్, స్కర్దూ, చునియన్ ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో వందకు పైగా పాక్ సైనికులు హతమయ్యారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!