TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!
- టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
- మతమార్పిడి ముఠాకు మలేషియా సంబంధాలు..
- విచారణ వేగవంతం చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లుగా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు కలిసి హిందూ మహిళా ఉద్యోగుల్ని వేధించిన కేసు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, ఉద్యోగ భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడటం, మతమార్పిడి చర్యలకు నిందితులు పాల్పడ్డారు.
మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో, కొందరు మహిళా పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బందిగా టీసీఎస్లో అండర్ కవర్గా పనిచేస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్లో ఒక పెద్ద మతమార్పిడి నెట్వర్క్ బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై మహారాష్ట్ర సర్కార్ సిట్ విచారణ ప్రారంభించింది. ఈకేసులో ఇప్పటి వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. అయితే, ఇప్పుడు బాధితుల సంఖ్య 12కు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రకారం, ఇందులో లైంగిక వేధింపులు, పెళ్లిపేరుతో మోసం చేసి అత్యాచారం, మతపరమైన ఒత్తిడి, భావోద్వేగ దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
Read Also: CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే
నలుగురు మహిళా కానిస్టేబుళ్లను టీసీఎస్లో పని చేసేలా పంపారు. వీరి ద్వారా నిందితులైన ఉద్యోగుల మధ్య జరుతున్న సంభాషణ, అనుమానాస్పద కదలికలపై కీలక సమాచారం సేకరించారు. ఈ కేసులో ‘‘ఇమ్రాన్’’ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతనికి మలేషియాతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా అనుమానం వ్యక్తమవుతోంది. వాట్సాప్ కాల్స్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, బెటర్ లైఫ్ గురించి చెప్పి ప్రభావితం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని అసలు గుర్తింపు, ఈ కేసులో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుకుల సహకరించిన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. నియామకాలు, సంస్థలో ఆమె పాత్ర, హిందూ మహిళల్ని ఎలా ట్రాప్ చేసిందనే దానిపై విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అతిపెద్ద మతమార్పిడి నెట్వర్క్తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుల వాట్సాప్ చాట్స్, అందులో ఉద్యోగుల్ని ఎలా ట్రాప్ చేయాలనే వ్యూహాలు వంటివి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. డిలీట్ చేసిన చాట్స్ను పొందేందుకు ఫోరెన్సిక్ టీమ్ ఈ మెసేజ్లను తిరిగి పొందేలా పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
-
AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!